Senani at MandapetaSenani at Mandapeta

ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబానికి పవన్ కళ్యాణ్ పరామర్శ
జనసేన పార్టీ తరఫున రూ. లక్ష ఆర్ధిక సాయం

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో (East Godavari District) జనసేన (Janasena) కౌలు రైతు భరోసా యాత్ర (Kaulu Rythu Bharosa Yatra) జాతరలా ప్రారంభమైంది. రాజమండ్రి రూరల్ (Rajahmundry Rural) నియోజకవర్గం, పొట్టిలంకలో ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతు  పచ్చిమళ్ల శంకరం కుటుంబాన్ని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పరామర్శించారు. శంకరం మృతికి గల కారణాలు కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. పార్టీ తరఫున లక్ష రూపాయల ఆర్ధిక సాయాన్ని (Financial assistance) ఆయన భార్య శ్రీమతి గౌరికి అందచేశారు.

శంకరం కుటుంబానికి జనసేన పార్టీ (Janasena Party) తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar), పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ (Kandula Durgesh) తదితరులు పాల్గొన్నారు.

జనసేనాని పవన్ కళ్యాణ్ గురించి ఒక స్వామీజీ మాటల్లో…