Modi at ICRISATModi at ICRISAT

హైదరాబాద్ (Hyderabad) చేరుకొన్న ప్రధాని మోడీ (Prime Minister Modi) ఇక్రిశాట్’లో (ICRISAT) ప్రసంగించారు. ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవ ఉత్సవాల సందర్భంగా అందరికీ ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. 50 ఏళ్ల ఇక్రిశాట్‌ ప్రయాణంలో పాల్గొన్న వారందరికీ మోడీ అభినందనలు తెలిపారు. అజాదీ అమృతోత్సవాల వేళ ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవాలు జరుపుకుంటుందని ప్రధాని తెలిపారు.

ఇక్రిశాట్‌ సేవలను ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను. టెక్నాలజీని మార్కెట్‌తో జోడించి వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు ఇక్రిశాట్‌ కృషి చేయడం చూస్తున్నాం. వాతావరణ పరిశోధన కేంద్రం రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు జరగబోయే మానవ నష్టం గురించి చర్చిస్తాం. కానీ మౌలిక సదుపాయలకు (Infrastructure facilities) జరిగిన నష్టం గురించి ఎప్పుడూ కూడా మనం మాట్లాడం. వాతావరణ మార్పులను తట్టుకునేలా ప్రపంచస్థాయి పరిశోధలనకు భారత్‌ వేదికగా నేడు మారింది. దీనికోసం భారత్‌ ఎన్నో చర్యలు తీసుకుంది. ఇటువంటి పరిశోధనలు చిన్న, మధ్య తరగతి రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి అని ప్రధాని పేర్కొన్నారు.

సమతామూర్తి విగ్రహావిష్కరణకు ప్రధాని మోడీ
నేడు హైదరాబాద్ రానున్న ప్రధాని మోడీ