Maddhi PoojaluMaddhi Poojalu

పశ్చిమ గోదావరి (West Godavari) ఏలూరు జిల్లా (Eluru District), జంగారెడ్డిగూడెం (Jangareddygudem) మండలము, గురవాయిగూడెం (Guravaigudem) గ్రామము నందు తెల్ల మద్ది చెట్టు (Tella Maddi Chettu) క్రింద స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి (Maddi Anjaneya Swamy) వారి దర్శనార్ధము చుట్టు ప్రక్కల గ్రామముల నుండియేగాక సుదూర ప్రాంతముల నుండి అధిక సంఖ్యలో విచ్చేసి శ్రీస్వామి వారి ఆలయము చుట్టూ 108 ప్రదక్షణలు
చేసి, మొక్కుబడులు తీర్చుకుని, శ్రీ స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన తమలపాకులు (నాగవల్లీ దళములు)తో అష్టోత్తరం పూజలను, అన్నప్రాసనలు, వాహనం పూజలను నిర్వహించుకున్నారు.

మంగళవారం మద్యాహ్నం గం.01.30 ని.ల. వరకు సామి వారి దేవస్థానమునకు వివిధ సేవల రూపేణ రూ.1,95,250/- లు సమకూరినది. శ్రీ స్వామి వారి దర్శనమునకు విచ్చేసిన సుమారు 1300 మంది భక్తులకు స్వామి వారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ జరుపబడినది. మంగళవారం స్వామి వారి దర్శనముంకు విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా ఆలయ పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు గావించి నట్లు ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షురాలు శ్రీమతి సరితా విజయభాస్కర రెడ్డి, మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు. . . .

–జంగారెడ్డిగూడెం నుండి గురువు బాబురావు

Shocking decision by Janasena Political Affairs Committee