Pawan Kalyan at RushikondaPawan Kalyan at Rushikonda

రుషికొండ లీలలను వెల్లడించడానికి రుషికొండకు వెళ్లిన పవన్ కళ్యాణ్
రుషికొండ పరిసరాల్లో తీవ్ర ఆంక్షలు-నిషిద్ధ ప్రాంతంగా రుషికొండ
అడుగడుగునా పోలీసుల బారికేడ్లు. ఎక్కడికక్కడపోలీసుల మోహరింపు
అన్ని మార్గాల మూసివేసిన పోలీసులు
సామాన్య ప్రజలు నడవటానికి కూడా అనుమతి నిరాకరణ
చెక్ పోస్టులు దాటుకుంటూ రుషికొండకు చేరిన జనసేనాని
మీడియా వాహనంపై నుంచి అక్రమ నిర్మాణాల పరిశీలన

ప్రకృతిలో సహజసిద్ధంగా ఏర్పడిన రుషికొండను (Rishikonda Destruction) తవ్వేసి అక్రమ కట్టడాలను (Illegal Constructions) కట్టుకొంటున్నవారికి స్వాగత సత్కారాలా? అసలు దీనికి అనుమతులు ఉన్నాయా? కొండను తవ్వాల్సిన అవసరం ఏమిటి అని ప్రశ్నించడానికి వెళుతున్న వారికి ఆంక్షల కంచెలా అని జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) జగన్ ప్రభుత్వంపై (Jagan Government) విరుచుకు పడ్డారు.

విశాఖలో (Visakhapatnam) జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర తీవ్ర ఆంక్షల మధ్య సాగుతోంది. పవన్ కళ్యాణ్ హోటల్ నుంచి అడుగు బయటపెడుతున్నారంటే పోలీసులు పలు ఆంక్షలు విధిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రుషికొండకు గుండు కొట్టి, ధ్వంసం చేసారు. ద్వాంశం చేస్తూ వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అక్రమ నిర్మాణాల పరిశీలనకు పవన్ కళ్యాణ్ వెళ్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని అష్ట దిగ్బంధనం గావించారు. అడుగడుగునా చెక్ పోస్టులు పెట్టారు. భారీ ఎత్తున పోలీసులను మోహరించి ఆంక్షలు అమలు చేశారు.

ఒకప్పుడు పర్యటక ప్రదేశంగా ఉన్న రుషికొండను నిషిద్ధ ప్రాంతంగా మార్చేశారు. బీచ్ రోడ్డుతో పాటు రుషికొండ వైపు వెళ్లే అన్ని రహదారులను పూర్తిగా మూసివేసి.. సామాన్య ప్రజలకు కూడా ప్రవేశం లేకుండా చేశారు. సామాన్యులు నడిచేందుకు కూడా అనుమతించ లేదు.

పవన్ కళ్యాణ్ పర్యటనపై యధావిధిగా ఆంక్షలు అమలు చేశారు. వాహనం నుంచి బయటకు రాకూడదు, ప్రజలు వచ్చినా అభివాదం చేయకూడదు వంటి రూల్స్ తో రంగంలోకి దిగారు. అయితే పోలీసుల ఆంక్షల కంచెలు దాటుకుంటూ రుషికొండకు వెళ్లిన పవన్ కళ్యాణ్ నిబంధనలకు విరుద్ధంగా కొండను తొలిచి చేస్తున్న అక్రమాలను బట్టబయలు చేశారు.

నోవాటెల్ నుంచే ఆంక్షలు

పవన్ కళ్యాణ్ రుషికొండ పర్యటన ప్రకటన వెలువడిన వెంటనే పోలీసులు విశాఖలో అలర్ట్ ప్రకటించారు. పవన్ కళ్యాణ్ బస చేసిన నోవాటెల్ హోటల్ ప్రాంతాన్ని డీసీపీ నుంచి సీఐ స్థాయి అధికారులు ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ వాహనంతోపాటు సిబ్బంది వాహనాలు, నాయకుల వాహనాలు తాము చెప్పిన విధంగానే ముందుకు వెళ్లాలని ఒత్తిడి చేశారు. పరిమిత సంఖ్యలో మాత్రమే వాహనాలను అనుమతిస్తామని తేల్చేశారు. జోడుగుళ్లపాలెం నుంచి అయితే కేవలం పవన్ కళ్యాణ్ వాహనాన్ని మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. తీవ్రమైన ఆంక్షల నేపథ్యంలో ఒక దశలో పరిస్థితులు పోలీసులు – పార్టీ నాయకుల మధ్య వాగ్వాదానికి దారి తీశాయి.

పోలీసు ఆంక్షల మధ్య 4.15 గంటల ప్రాంతంలో హోటల్ నుంచి పవన్ కళ్యాణ్ రుషికొండకు బయలుదేరారు. పవన్ కళ్యాణ్ వాహన శ్రేణికి ముందు, వెనుక కూడా పోలీసు వాహనాలను మోహరించి ముందుకు తీసుకువెళ్లారు. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, ద్విచక్ర వాహనాలతో పార్టీ శ్రేణులు పవన్ కళ్యాణ్ ని అనుసరించాయి.

కదిలేదిలేదన్న పవన్ కళ్యాణ్

జోడుగుళ్లపాలెం వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద పోలీసుల ఆంక్షలతో కాసేపు హైడ్రామా నడిచింది. పవన్ కళ్యాణ్ తో పాటు వచ్చిన వాహనాలను నియంత్రించి అక్కడే నిలిపివేసే ప్రయత్నం చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ , పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వాహనం నుంచి కిందికి దిగి పోలీసులతో మాట్లాడారు. ప్రతి వాహనాన్ని తనతో వదిలితేనే ముందుకు కదులుతానని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. అప్పటికే అక్కడికి పెద్ద సంఖ్యలో జన సైనికులు చేరుకుంటుండడంతో పోలీసులు దిగి వచ్చారు. అన్ని వాహనాలను ముందుకు వెళ్లేందుకు అనుమతిచ్చారు. మార్గమధ్యంలో మరో మూడు చెక్ పోస్టులు పోలీసులు ఏర్పాటు చేయగా అన్ని చోట్లా పవన్ కళ్యాణ్ వాహనం నుంచి కిందికి దిగాల్సి వచ్చింది. రాడిసన్ బ్లూ హోటల్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద జనసైనికుల ద్విచక్ర వాహనాల తాళాలు, సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకోగా, పవన్ కళ్యాణ్ పోలీసులతో మాట్లాడి వాటిని వెనక్కి ఇప్పించారు.

మీడియా వాహనం పైకి ఎక్కి…

అక్కడి నుంచి రుషికొండకు గుండు కొట్టిన ప్రాంతానికి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. రుషికొండ పైకి వెళ్లే మార్గాన్ని మూసివేసి అటువైపు వెళ్లకుండా వందల సంఖ్యలో పోలీసులను మోహరించారు. అక్కడ వాహనం నుంచి దిగి రోడ్డు వెంట నడుస్తూ రుషికొండలో వైసీపీ ప్రభుత్వ ధ్వంస రచనను పరిశీలించారు. పార్టీ నాయకులు అడిగి అక్కడ జరుగుతున్న విధ్వంసంపై ఆరా తీశారు. స్థానిక యువత కూడా పచ్చటి రుషికొండను వైసీపీ ఎలా మార్చేసిందో పవన్ కళ్యాణ్ వివరించారు.

న్యాయ స్థానాల ఆదేశాలను పట్టించుకోకుండా అక్కడ నిర్మించిన ప్యాలెస్ ను పరిశీలించారు. రోడ్డు పైనుంచి పూర్తిగా భవనాలు కనబడక పోవడంతో మీడియా కోసం ఏర్పాటు చేసిన వాహనం పైకి ఎక్కి నిర్మాణాలను పరిశీలించారు. అక్రమ నిర్మాణాలపై మీడియా మిత్రులను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు.

దారి పొడుగునా జనమే జనం

జనసేనాని రుషికొండ రాక విషయం తెలుసుకున్న పార్టీ శ్రేణులు, ప్రజలు దారిపొడుగునా ఆయనకు స్వాగతం పలికేందుకు ఎగబడ్డారు. కైలాసగిరి, జోడుగుళ్లపాలెం, విశాఖ వ్యాలీ రోడ్డు, సాగర్ నగర్ తదితర ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్ల మీదకు వచ్చారు. పోలీసు ఆంక్షల నేపధ్యంలో పవన్ కళ్యాణ్ వాహనం లోపలి నుంచే అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. అయితే కైలాసగిరి వద్ద, జోడుగుళ్లపాలెం తదితర ప్రాంతాల్లో జనసైనికులు, ప్రజలు వాహనానికి అడ్డుగా నిలబడి పవన్ కళ్యాణ్ బయటికి రావాలంటూ పట్టుబట్టారు. ప్రజల కోరిక మేరకు బయటకు వచ్చి వారికి అభివాదం చేశారు. కొంత మందితో ఫోటోలు దిగారు.

వందల సంఖ్యలో పోలీసుల మోహరింపు

పవన్ కళ్యాణ్ రుషికొండ పర్యటన నేపధ్యంలో ఆర్కే బీచ్ నోవాటెల్ హోటల్ నుంచి గీతం కాలేజీ మధ్య వందల సంఖ్యలో పోలీసులను మోహరించారు. పోలీసుల తీరు పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమయ్యింది.

విశాఖలో ఆంధ్ర వీరప్పన్ అవినీతి బాగోతం: పవన్ కళ్యాణ్