Sai Dharma TejaSai Dharma Teja

హీరో సాయి ధర్మ తేజ్ (Sai Dharam Tej) ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు అపోలో ఆసుపత్రి (Apollo Hospital) వైద్యులు తెలిపారు. సాయి ధర్మ తేజ్ మెగాస్టార్‌ చిరంజీవి (Mega star) మేనల్లుడు. సాయిధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. స్పోర్ట్స్‌ బైక్‌ (Sports Bike) నడుపుతున్న సాయిధరమ్‌ ఒక్కసారిగా బైక్‌ అదుపు తప్పడంతో కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన కుడికంటిపై భాగంతో పాటు ఛాతీ భాగంలో గాయాలయ్యాయి. సాయి ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సాయి తేజ్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కాలర్‌ బోన్‌ ఫ్యాక్చర్‌ అయిందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆందోళన చెందాల్సిన పనిలేదని ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స సాయికి కొనసాగుతోందని. మరో 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని వైద్యులు సూచించారు.

రాయదుర్గం (Raidurgam)  పోలీసు స్టేషన్ (Police Station) పరిధిలో గల ఐకియా స్టోర్‌ సమీపంలో కేబుల్ బ్రిడ్జి (Cable Bridge) పై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కేబుల్ బ్రిడ్జిపై నుంచి ఐకియా వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. స్పోర్ట్స్‌ బైక్‌’పై వెళ్తున్న సాయిధరమ్‌ వాహనం అదుపుతప్పి కింద పడిపోయారు. దీంతో ఆయనకు పలుచోట్ల గాయాలయ్యాయి. సాయి పడిపోవడాన్ని గమనించిన స్థానికులు 108 కు సమాచారం అందించారు. 108 సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు. ఆ సమయంలో ఆయన అపస్మారక స్థితిలో ఉన్నట్టు తెలిసింది. కొద్ది సేపటి తర్వాత నటుడు సాయిధరమ్‌ తేజ్‌గా గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మాదాపూర్‌లోని మెడికవర్‌ ఆసుపత్రికి సాయి ధరమ్’ని తరలించారు.

జనసేన అధినేత, ప్రముఖ నటుడు పవన్‌కల్యాణ్‌‌, సినీ దర్శకుడు త్రివిక్రమ్‌, అల్లు అరవింద్‌ తదితరులు ఆసుపత్రికి వచ్చారు. సాయిధరమ్‌ ఆరోగ్య పరిస్థితిని వైద్యులతో మాట్లాడి తెలుసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత మెరుగైన చికిత్స నిమిత్తం అపోలో ఆసుపత్రికి సాయి ధరమ్ తేజ్’ని తరలించారు.

Court Permitted for Ganesh Festival