Nagababu with NRI JanasainiksNagababu with NRI Janasainiks

సేవా కార్యక్రమాలకు ఎన్ఆర్ఐలు అందించిన తోడ్పాటు మరవలేనిది
పార్టీ సిద్ధాంతాలు, భావజాలాన్ని క్షేత్రస్థాయిలోకి బలంగా తీసుకెళ్లాం
ప్రతి ఒక్కరు మరో వందమందిని ప్రభావితం చేసేలా పనిచేద్దాం
ఆమ్ స్టర్ డ్యామ్ లో జనసేన శ్రేణుల ఆత్మీయ సమావేశంలో నాగబాబు

జనసేన పార్టీ (Janasena Party) బలోపేతానికి ప్రవాస భారతీయులంతా (NRI) జనసేన పార్టీకి అందిస్తున్న తోడ్పాటు మరువలేనిది అని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదల నాగబాబు (Konidela Nagababu) అన్నారు. ఎన్ఆర్ఐలు అంతా పార్టీ బలోపేతానికి తమవంతుగా సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రవాసీలుగా ఉన్న భారతీయులందరికీ తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు.

ఐరోప పర్యటనలో భాగంగా ఆదివారం ఆమ్ స్టర్ డ్యామ్ లో జనసైనికులు, వీరమహిళలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ… “జనసేన పార్టీ ఏడు సిద్ధాంతాలు ఎంతో ఆలోచనతో కూడినవి. పార్టీ కోసం అహర్నిశలు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పడుతున్న కష్టం దాని వెనుక ఉన్న కృషిని జనసేన పార్టీ సానుభూతిపరులు ప్రతి ఒక్కరు గ్రహించి దానిని ఇతరులకు తెలియజేసే బాధ్యతను తీసుకోవాలి.

ఎంతో విజ్ఞానం ఉన్న ప్రవాస భారతీయులు మన దేశం నుంచి ఇతర దేశాలకు వచ్చి వారి వారి పనులు చేసుకుంటూనే, పార్టీ కోసం కొంత సమయం కేటాయిస్తున్నందుకు ధన్యవాదాలు. పార్టీ భావజాలాన్ని సామాన్యులకు అర్థం అయ్యేలా, భారతదేశంలో ఉన్న కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకు తెలిసేలా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే ప్రవాస భారతీయుల సేవలు జనసేన పార్టీకి వెన్ను దన్నుగా నిలిచాయి. వీటిని మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉంది.

గత పది రోజులుగా యూరోప్ లో పర్యటిస్తున్నాను. వేలాది మంది జనసేన పార్టీ సానుభూతిపరులను కలిశాను. ఒక్కొక్కరు వంద మందిని ప్రభావితం చేయగలిగితే పార్టీ క్షేత్రస్థాయిలో మరింత బలపడుతుంది. పార్టీ చేపట్టిన అనేక సేవా కార్యక్రమాలకు ఎన్ఆర్ఐలు అందించిన చేయూత మరవలేనిది. సమాజ శ్రేయస్సు కాంక్షించి పార్టీకి మద్దతుగా నిలబడిన ప్రతీ ప్రవాస జనసైనికుడు, వీర మహిళలకు అభినందనలు” అని కొణిదెల నాగబాబు అన్నారు. ఈ సమావేశంలో పార్టీ ఆస్ట్రేలియా కన్వీనర్ శశిధర్ కొలికొండ తదితరులు పాల్గొన్నారు.

BRO Movie సినిమాపై అక్షర సత్యం విశ్లేషణ (సూటిగా సుత్తిలేకుండా)