Javvadi Lakshmayya NaiduJavvadi Lakshmayya Naidu

జవ్వాది లక్ష్మయ్య నాయుడు లాంటి మాహ్న్నతమైన వ్యక్తిల చరిత్ర నేటి యువతకి తెలియడం లేదు. ఇలా ఎందరో గొప్ప గొప్ప యోధుల చరిత్ర ఆధిపత్య వర్గాల మీడియా తెరల మాటున నలిగి మాడి మసైపోతున్నది. మరుగున పడిపోతున్న మహా మహా యోధుల్లో మన జవ్వాది లక్ష్మయ్య నాయుడు ఒక్కరు. వీరు మహోన్నతమైన చరిత్రని, సాహిత్య పోషణను నేటి యువతకి తెలియచేయడం కోసమే మా ఈ చిరు ప్రయత్నం.

జవ్వాది లక్ష్మయ్య నాయుడు సహజ సౌజన్య సంపత్తి. ఉదారత. వితరణ. కళారాధనతో పాటు సహకార రంగానికి చేసిన సేవలతో ఆంధ్ర లోకమంతా జవ్వాజి వలే కొన్ని దశాబ్దాలపాటు గుభాళించారు. పెనుగొండ జమిందార్ కవికులాంలంకార,అభినవ భోజ, సాహితీవేత్త, సహకార ఉద్యమ నేత మన జవ్వాది లక్ష్మయ్య నాయుడు. తన రాజకీయ జీవితంలో వేల మందికి మందికి ఉద్యోగాలు ఇచ్చారు.

“కవికులాలంకార”జవ్వాది లక్ష్మయ్య నాయుడు (1901-1978) తణుకు తాలూకా పెనుగొండలో జమిందారీ కుటుంబంలో1901 నవంబరు 16న జన్మించారు. సుబ్బమాంబ, వెంకయ్యలు తల్లిదండ్రులు. తణుకులో ఉన్నత విద్యను అభ్యసించారు. మంచి జాతీయవాది.

పెనుగొండ గ్రామపంచాయితీకి దశాబ్దాల పైన అధ్యక్షుడు. తణుకు తాలూకాబోరు సభ్యులుగానూ కొంతకాలమున్నారు. పెనుగొండ శాసనసభకు నియోజకవర్గానికి మూడుసారు ప్రాతినిధ్యం వహించారు. 1953లో ఏలూరు సహకార కేంద్రబ్యాంకు అధ్యక్షులుగా ఎన్నికై, 17 సంవత్ల ఆ పదవిలో కొనసాగారు. జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్గా 15 సంuలు పనిచేసారు.

సాహిత్య ప్రియలుగా, దానశీలిగా ప్రసిద్దులు. తణుకు తాలూకాలో ముళ్ళపూడి వంశీయులకు దీటైన వారిగా జవ్వాది వారినే చెప్పాలి. “కవికులాలంకార, “వాజ్మయోద్దారక అనేవి వీరికి లభించిన బిరుదులు. 16-02-58న తణుకు నన్నయ పీఠం జరిపిన శివరాత్రి సాహిత్య సమారాధన మహోత్సవ కార్యక్రమానికి వీరు అధ్యక్షత వహించారు. భాషా, సాహిత్య వాజ్మయోద్దారణలో వీరు తణుకు జమిందార్ ముళ్ళపూడి తిమ్మరాజు సమకాలికుడు. ఆంధ్రా సుగర్స్ వ్యవస్థాపక డైరెక్టర్ కూడాను.

తణుకులో స్త్రీజనాభ్యుదయానికై జవ్వాది లక్ష్మయ్య నాయుడు గృహదానంచేసి, వసతులను కల్పించి, ధనసహాయం చేసారు. తణుకు తాలూకా ప్రాంతం గర్వించదగ్గ ఈ మహోన్నత వ్యక్తి జనవరి 27న, 1978 సంవత్సరంలో పరమపదించారు

జవ్వాది లక్ష్మయ్య నాయుడు సహకార రంగానికి చేసిన సేవ

లక్ష్మయ్యనాయుడు 1927లో పెనుగొండ లో తన అధ్యక్షతన ప్రథమంగా వ్యవసాయ సహకార సంఘాన్ని స్థాపించారు. 1931లో పెనుగొండలో మండల సహకార సంఘాల సమావే శాన్ని ఏర్పాటు చేసి, సహకార సంఘాల ప్రయోజనాల్ని రైతులకు చెప్పారు. 1930లో పెనుగొండలో సహకార భూమి తనఖా బ్యాంకును స్థాపించి, రైతులకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణ సదుపాయాలు కల్పించారు. 1935లో పెనుగొండలో సహకార మార్కెటింగ్ సంఘాన్ని స్థాపించారు. రైతుల కోసం ధాన్యం గిడ్డంగులను నిర్మించారు.

1936లో పెనుగొండ సహకార గృహ నిర్మాణ సంఘాన్ని ఏర్పాటు చేసి, అల్పాదాయ వర్గాలకు గృహ నిర్మాణాలు చేసుకునే అవకాశం కల్పించారు. 1938లో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డెరైక్టర్‌గా ఎన్నికయ్యారు. 1953 ఆగస్టు నుంచి 1969 ఆగస్టు వరకు జిల్లా కేంద్ర సహకార సంఘానికి అధ్యక్షునిగా పనిచేశారు. నాయకత్వ పటిమతో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఆర్థిక పరిపుష్టికి పాటు పడ్డారు. వందలాది మంది వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన విద్యార్థులను ఉద్యోగాల్లో నియమించి ఉపాధి కల్పించారు. 1960 మార్చి 13న ఆంధ్ర రాష్ట్ర సహకార సభలు లక్ష్మయ్యనాయుడు ఆధ్వర్యంలో ఏలూరు సహకార కేంద్ర బ్యాంకు ప్రాంగణంలో నిర్వహించారు.నేటికీ ఆయన కాంశ్య విగ్రహం ఏలూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో ఉంది.

పెనుగొండ జమిందార్’గా ప్రసిద్ధి. అభినవ భోజ బిరుదాంకితుడు. పశ్చిమ గోదావరి జిల్లాల్లో సహకార ఉద్యమాన్ని నడిపించారు. పెనుగొండలో 1961 నవంబర్ 18న లక్ష్మయ్య నాయుడు షష్టి పూర్తి వైభవంగా జరిగింది. మహాకవి గుర్రం జాషువా కవీంద్రులు లక్ష్మయ్య నాయుడును “పెనుగొండ ప్రభువు” అని కీర్తించారు. గుదిమెళ్ల రామానుజాచార్యులు నాయుడును “పెనుగొండ గండశిల కాదు. జవ్వాది కొండ” అని స్తుతించారు.

లక్ష్మయ్యనాయుడు పెనుగొండ నియోజక వర్గం నుంచి 1955, 1967లలో శాశన సభ్యులు గా రెండు సార్లు ఎన్నికయ్యారు. తనప్రత్యర్థుల ప్రశంసలను సైతం పొందగలిగిన గొప్ప వ్యక్తి .

జవ్వాది లక్ష్మయ్య నాయుడు సాహిత్య పోషణ

లక్ష్మయ్యనాయుడు గృహం శారదా పీఠం. తన అధ్యక్షతన పరకాల సూర్యనారాయణ కార్యదర్శిగా పెనుగొండలో సాహితీ పరిషత్‌ను స్థాపించారు. సాహితీ దురంధరులను వీరిని ఘనంగా సన్మానించారు. వీరు ప్రప్రథమంగా స్వీకరించిన కృతి కవిశేఖర కాళహస్తి నరసింహరావు రచించిన భగవద్గీతానువాదం. ఈ కృతి స్వీకరణోత్సవానికి ఆంధ్రదేశం నలుమూలల నుంచి కవి పండితులు వచ్చారు.

ఆ సభకు శ్రీపాద కృష్ణమూర్తి అధ్యక్షత వహించారు. ఆంధ్రప్రదేశ్ తొలి ఆస్థాన కవి చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి మలి ఆస్థాన కవి శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, కళాప్రపూర్ణ చిలకమర్తి లక్ష్మీనరశింహం మొదలైన పండితులు లక్ష్మయ్యనాయుడి సాహిత్యాభిమానం తెలిసినవారే. 1940లో పెనుగొండలో జరిగిన అఖిలాంధ్ర ఉపాధ్యాయ పరిషత్తు లక్ష్మయ్య నాయుడును “వాజ్మయోద్ధారక” బిరుదుతో సత్కరించింది. ఇంకా కవి కులాలంకార, సామ్రాజ్య సామ్రాట్ బిరుదులు ఆయన కీర్తి కిరీటంలో చేరాయి. 1954లో పశ్చిమ గోదావరి జిల్లా లోకల్ లైబ్రరీ అథారిటీకి ఛైర్మన్‌గా 15 ఏళ్లు పని చేసారు. తద్వారా గ్రంథాలయోద్యమాన్ని వ్యాప్తి చేశారు.

లక్ష్మయ్యనాయుడు సంపాదకుడుగా విశ్వామిత్ర పత్రిక స్థాపించి రెండేళ్లు నిర్వహించారు. తెలుగు సాహిత్యంలో ఎనలేని సేవలు అందించారు.ప్రతీ ఏడాది తన జన్మదినం రోజున ఆంధ్రదేశంలో ప్రసిద్ధి గాంచిన కవులను పెనుగొండ రప్పించి వారికి ఘనంగా కానుకలు అందించేవారు.

జవ్వాది లక్ష్మయ్య నాయుడు లాంటి మాహ్న్నతమైన వ్యక్తిల చరిత్ర నేటి యువతకి తెలియడం లేదు. ఇలా ఎందరో గొప్ప గొప్ప యోధుల చరిత్ర ఆధిపత్య వర్గాల మీడియా తెరల మాటున నలిగి మాడి మసైపోతున్నది. మరుగున పడిపోతున్న మహా మహా యోధుల్లో మన జవ్వాది లక్ష్మయ్య నాయుడు ఒక్కరు. వీరు మహోన్నతమైన చరిత్రని, సాహిత్య పోషణను నేటి యువతకి తెలియచేయడం కోసమే మా ఈ చిరు ప్రయత్నం.

ఈ చరిత్రని మా అక్షర సత్యం సృష్టించింది కాదు. వెబ్’లో ఉన్న దాన్నీ సేకరించి క్రోడీకరించి మీకు ఇవ్వడానికి మా అక్షర సత్యం టీం ప్రయత్నం చేసింది. తప్పులుంటే మన్నిస్తారని అలానే నిజమంటే మరుగున పడిపోతున్న మన యోధుల చరిత్రని మరో పది మందికి చెబుతారని ఆశిస్తూ…

–టీం అక్షర సత్యం నుండి టి వి గోవింద రావు, హై కోర్టు అడ్వకేట్

రణస్థలం కాదిది రంగస్థలం!
అధర్ముల పాలిట మరో కురుక్షేత్రం?