AP Budget 2023-24AP Budget 2023-24

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 2023-24ను (AP Budget 2023-24) ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి (Buggana Rajendranath Reddy) గురువారం రోజున అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. వైసీపీ నాయకుల (YCP Leaders) హర్షద్వానాల మధ్య, టీడీపీ సభ్యుల నిరసనల మధ్య బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి రూ.2.79 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రతిపాదించారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రములో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ (AP budget 2023-24)ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తరువాత పలు విమర్శలు కూడా వస్తున్నాయి. పోతన పద్యంతో, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ వ్యాఖ్యలతో బడ్జెట్‌ ప్రసంగాన్ని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి మొదలుపెట్టారు. ఈ సందర్భంగా బడ్జెట్‌ రూపకల్పనలో భాగస్వాములైన వారికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కరోనా సంక్షోభ సమయంలో ఎన్నో ఆటుపోట్లను అధిగమించామని మంత్రి బుగ్గన తెలిపారు. ఈసారి బడ్జెట్‌’లో సుస్థిర అభివృద్ధి, సుపరిపాలనపై దృష్టి సారించామన్నారు.

ఆంధ్ర రాష్ట్రంలో వ్యవసాయంపై 62శాతం మంది ఆధారపడి జీవిస్తున్నట్టు మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి తెలిపారు. రైతుల ఆదాయం పెంచడంపైనే వైసీపీ ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. రైతు లేనిదే రాజ్యం లేదని విశ్వసించే ప్రభుత్వం తమదని మంత్రి బుగ్గన అన్నారు.

రాష్ట్రంలోని రైతు భరోసా కేంద్రాల పనితీరును ప్రపంచం మెచ్చుకుందని ఆర్ధిక మంత్రి అన్నారు. మిగిలిన 7,853 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు నిధులు కేటాయిస్తున్నట్లు బుగ్గన తెలిపారు. రాష్ట్రాభివృద్ధిలో పాడిరంగం కీలక పాత్రం పోషిస్తుందని బుగ్గన వివరించారు. కోడి గుడ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉందన్నారు. మాంసం ఉత్పత్తిలో రెండో స్థానం, పాల ఉత్పత్తిలో 5వ స్థానంలో ఆంధ్ర ప్రదేశ్ ఉందని మంత్రి బుగ్గన వెల్లడించారు. వైఎస్‌ఆర్‌ పశు బీమా పథకం పశువుల బీమా కోసం తీసుకొచ్చినట్లు మంత్రి బుగ్గన తెలిపారు. రాష్ట్రంలో 340 సంచార పశువైద్యశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ఆర్ధిక మంత్రి వివరించారు. 154 నియోజవర్గాల్లో జంతు వ్యాధుల నిర్ధారణ కేంద్రాలు మంజూరు చేశామని ఈ సందర్భంగా చెప్పారు.

ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్‌ 2023 – 24 కేటాయింపులపై క్లుప్తంగా

వైఎస్‌ఆర్ పెన్షన్ కానుక రూ.21,434.72 కోట్లు
వైఎస్ఆర్ రైతు భరోసా రూ.4,020 కోట్లు
జగనన్న విద్యా దీవెన రూ.2,841.64 కోట్లు
జగనన్న వసతి దీవెన రూ.2,200 కోట్లు
వైఎస్‌ఆర్-పీఎం బీమా యోజన రూ.1600 కోట్లు

యువజన అభివృద్ధి, పర్యాటకం, సాంస్కృతిక శాఖ రూ.1,291 కోట్లు
షెడ్యూల్ కులాల కాంపొనెంట్ కోసం రూ.20,005 కోట్లు
షెడ్యూల్ తెగల కాంపొనెంట్ కోసం రూ.6,929 కోట్లు
వెనుకబడిన తరగతుల కాంపొనెంట్ కోసం రూ.38,605 కోట్లు
కాపు సంక్షేమం రూ.4,887 కోట్లు

వైఎస్‌ఆర్ నేతన్న నేస్తం రూ.200 కోట్లు
వైఎస్ఆర్ మత్స్యకార భరోసా రూ.125 కోట్లు
మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ రూ.50 కోట్లు
రైతు కుటుంబాల పరిహారం కోసం రూ.20 కోట్లు
లా నేస్తం రూ.17 కోట్లు

డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1,000 కోట్లు
రైతులకు వడ్డీలేని రుణాలు రూ.500 కోట్లు
వైఎస్ఆర్ కాపు నేస్తం రూ.550 కోట్లు
జగనన్న చేదోడు రూ.350 కోట్లు
వైఎస్‌ఆర్ వాహనమిత్ర రూ.275 కోట్లు

అమ్మఒడి రూ.6500 కోట్లు
మొత్తంగా డీబీటీ స్కీంలకు రూ.54,228.36 కోట్లు
ధరల స్థిరీకరణ నిధి రూ.3,000 కోట్లు
వ్యవసాయ యాంత్రీకరణ రూ.1,212 కోట్లు
వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం రూ.15,882 కోట్లు

జగనన్న తోడు రూ.35 కోట్లు
ఈబీసీ నేస్తం రూ.610 కోట్లు
వైఎస్‌ఆర్ కల్యాణమస్తు రూ.200 కోట్లు
వైఎస్ఆర్ ఆసరా రూ.6700 కోట్లు
వైఎస్ఆర్ చేయూత రూ.5000 కోట్లు

మన బడి నాడు-నేడు రూ.3,500 కోట్లు
జగనన్న విద్యా కానుక రూ.560 కోట్లు
పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధికి రూ.15,873 కోట్లు
పురపాలక, పట్టణాభివృద్ధి రూ.9,381 కోట్లు
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ రూ.1,166 కోట్లు

మైనార్టీల సంక్షేమం రూ.4,203 కోట్లు
పేదలు అందరికీ ఇళ్లు రూ.5,600 కోట్లు
పరిశ్రమలు, వాణిజ్యం రూ.2,602 కోట్లు
రోడ్లు, భవనాల శాఖకు రూ.9,118 కోట్లు
నీటి వనరుల అభివృద్ధికి (ఇరిగేషన్‌) రూ.11,908 కోట్లు

పర్యావరణం, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ రూ.685 కోట్లు
ఎనర్జీ రూ.6,456 కోట్లు
గ్రామ, వార్డు సచివాలయ శాఖ రూ.3,858 కోట్లు
గడప గడపకు మన ప్రభుత్వం రూ.532 కోట్లు.

కుల అధిపత్యానికి వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని స్థాపిస్తాం