Kapu leadersKapu leaders

కాపు నాయకులు పల్లకీల మోత వైకిరి మానుకోవాలి
చిరు, ముద్రగడలాంటివారు పెద్దరికం వహించాలి

ఒక రంగాని కోల్పోయాం. మరో రంగాని వదులుకోవాలా?
సేనాని మనోనేత్రంతో ఆలోచించడం మొదలు పెట్టాలి 

సోదర దళిత, బీసీ వర్గాలతో రాజ్యాధికారం పంచుకోవాలి

గ్రామానికొక బొబ్బిలి బ్రహ్మన్నగా (Bobbili Brahmanna) కాపు (Kapu), తెలగ (Telaga), బలిజ (Balija), ఒంటరి (Ontari) కులస్థులు (Kapus) శతాబ్దాలు పాటు కొనసాగారు. గ్రామ పాలన, చట్టాలు, నిర్వహణ మొదలుకొని నూటొక్క అవిభాజ్య సామ్రాజ్యాలను కాపులు (Kapu) పాలించారు. నేటి పాలక వర్గాల ఉనికేలేని రోజుల్లో కాపులు సామ్రాజ్యాధినేతలుగా ఉండేవారు. ఇది కొన్ని శతాబ్దాల పాటు కొనసాగింది. కానీ ఈ కాపులు వారి గతం మరిచి నేడు కోడి పందాలకు అనుమతి నివ్వండి ప్రభో అన్నట్లు పాలకులను ప్రాధేయ పడే స్థాయికి కాపు నాయకులు (Kapu Leaders) దిగజారిపోయారు. ఇది కాల ప్రభావమా లేక కాపువారి మనో నేత్రం (Mano Netram) మూసుకుపోవడం వల్లనా? ఏపార్టీ అధికారంలో ఉన్నా గాని పాలకులను కాపాడే బౌన్సర్’లుగానే కాపులు మిగిలిపోతున్నారు? అనే ఆరోపణలు మిన్నంటుతున్నాయి. దీనికి కారణం పాలకుల అణచివేతలు మాత్రమే కాదు. కాపుల, కాపు నాయకుల (Kapu Leaders) జ్ఞాన నేత్రాలు (Jnana Netralu) మూసుకుపోవడం వల్లనేనా? అని యువత ఆలోచించాలి.

భవిష్యత్తు కాపులదే అనే సరికొత్త డ్రామా?

వర్తమాన కాలంలో కాపులు (Kapulu) అణగారిన వర్గాల (Weaker Sections) పార్టీ అయిన జనసేనకి (Janasena) మద్దతు నివ్వడం లేదు. కాపు నాయకుల్లో ఎక్కువమంది పాలకుల పల్లకీలు (Pallakeelu) మోస్తున్నారు. ఈ కాపు నాయకులు జనసేన లాంటి పార్టీలకు ఎందుకు నేడు మద్దతు నివ్వడం లేదో చెప్పరు కాక చెప్పరు. పవన్ కళ్యాణ్’ (Pawan Kalyan) లాంటి నిజాయితీ పరుడిని (Hones Person) ఎందుకు సీఎంగా (CM) చెయరాదో చెప్పక కాక చెప్పరు. కానీ భవిషత్తు రాజకీయాలు (Politics) మాత్రం కాపులవే అంటూ సరి కొత్త డ్రామాలు మొదలు పెడుతున్నారు. ఇది ముమ్మాటికీ కాపు యువతని (Kapu Youth) మోసం చేసే విష ప్రచారమే. మన పార్టీలకు మద్దతు నివ్వకుండా కాపులకు అధికారం (Rajyadhikaram) ఎలా వస్తాది?

అణగారిన వర్గాల పార్టీ (suppressed classes party) అయిన జనసేనకు (Janasena) మద్దతు నిద్దాం అని చెప్పడానికి ఈ కాపు నాయకులకి (Kapu Leaders), కాపులకి అహంకారం (arrogance) అడ్డు వస్తున్నది. నేటి జనసేన పేరు ఎత్తకుండా కాపులదే అధికారం అంటే దీని అర్ధం ఏమిటి? ఇది జనసేన ఉనికినే త్రుంచేశే ఎత్తుగడ కాదా? దీనికి  కాపు నాయకులే బాధ్యులు కాదా? ఇది  కాపు నాయకులచే పాలకులు ఆడిస్తున్న సరికొత్త డ్రామా కాదా? అవసరం అయితే సోదర దళిత (Dalit), బీసీ (BC) వర్గాలతో రాధికారాన్ని పంచుకోవాలి అనే అవగాహన కాపులకు రావాలి. అనేది కాపులు, కాపు నాయకులు తెలిసికోగలిగితేనే కాపులకు భవిత ఉంటుంది. లేకపోతే కాపుల భవిత జీ హుజూర్ అనే కుల నాయకుల చేతుల్లో బంధీగానే కొనసాగుతుంది.

డిప్యూటీ సీఎంలు ద్వారా కాపులు సాధించింది ఏమిటి?

కాపుల్లో ఉన్న చైతన్యాన్ని, అసమ్మతిని, ఆవేశాన్ని మూడు మంత్రిపదవులకో లేక ఒక డిప్యూటీ సీఎం (Deputy CM) పదవికో పాలకులు కొనేసికొంటున్నారా? లేక మనం అమ్మిసి కొంటున్నామా? లేదా అనేది కాపులు ఒక్కసారి ఆలోచించాలి. ఒక నిమ్మకాయలకి డిప్యూటీ సీఎం రావడం వల్ల కాపులకి ప్రయోజనం ఏమిటి? నేడు ఒక నానికి డిప్యూటీ సీఎం ఇవ్వడం వల్ల కాపులకి ఏమి ఒనగూరుతున్నది? అనేది కాపులు, కాపు నాయకులు తెలిసికోగలిగితేనే కాపులకు భవిత ఉంటుంది. లేకపోతే కాపుల భవిత జీ హుజూర్ అనే కుల నాయకుల చేతుల్లో బంధీగానే కొనసాగుతుంది.

బౌన్సర్ డ్యూటీలు మనకా -పెత్తనాలు మాత్రం కమ్మని దొడ్డలకా?

ఒక ప్రధాన మంత్రినిగాని (Prime Minister), ఒక అమిత్ షాని (Amit Sha) గాని, లేక ఒక నిర్మలా సీతారామన్ (Nirmala Seetharaman) లాంటి వారిని కలవడానికి విజయ సాయి రెడ్డి (Vijaya Sai Reddy), అవినాష్ రెడ్డి (Avinasha Reddy) లాంటి తమ కులపోల్లు కావాలా? తిట్టడానికి, విరుచుకుపడడానికి కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు కావాలా? ఎందుకు ఈ వివక్షత? కాపుల్లోగాని, బీసీల్లోగాని లేదా దళితుల్లోగాని ఉన్న ఎంపీలకు ఆ స్థాయి లేదా?

అసలు మన అణగారిన వర్గాల ఎంపీలకు ఆ స్థాయి ఎందుకు రావడం లేదు. ప్రెస్ మీటుల్లో తిట్టే స్థాయిని నుండి మంతనాలు, లేదా ఇంచార్జిలు అయ్యే స్థాయికి ఈ కాపులు, బీసీలు, దళితులు ఎందుకు ఎదగడం లేదు? అనేది కాపులు, కాపు నాయకులు తెలిసికోగలిగితేనే కాపులకు భవిత ఉంటుంది. లేకపోతే కాపుల భవిత జీ హుజూర్ అనే కుల నాయకుల చేతుల్లో బంధీగానే కొనసాగుతుంది.

ఉద్యోగ సంఘాలను కలవడానికి సజ్జల రామ కృష్ణ రెడ్డి (Sajjala Rama Krishna Reddy), బుగ్గన రాజేద్రనాధ్ రెడ్డిలు (Buggana Rajendranadh Reddy) కావాలి. అదే పవన్ కళ్యాణ్’ని గాని, చిరంజీవిని (Chiranjeevi) గాని లేదా ఒక ముద్రగడని (Mudragada) గాని తిట్టించడానికి మాత్రం ఒక అంబటి రాంబాబు (Ambati Rambabu), ఒక పేర్ని నాని (Perni Nani), కురసాల (Kurasala), ఒక బొత్స (Botsa), ఒక బోండా ఉమా (Bonda Uma), నిమ్మకాయల చినరాజప్ప (Nimmakayala China Rajappa) లాంటివారు కావాలి? కాపుల్లగాని, బీసీల్లోగాని, దళితుల్లోగాని ఉన్న నాయకులకు మంతనాలు చేసే స్థాయి లేదా? వాళ్లకి తిట్టడం తప్ప మరేది రాదా? మనం అంత దిగజారి పోయామా? గత ప్రభుత్వాల్లో కూడా ఇదే పరిస్థితి. ఇంతకీ మన కులపోడు ఒక ఎమ్మెల్యే, ఎంపీ లేదా మంత్రి అవుతున్నది సమాజాన్ని, లేదా తమ జాతిని ఉద్ధరించడానికా లేక మనల్ని తిట్టడానికేనా? తమ యజమానులకు బౌన్సర్’గా మాత్రమే కాపు నాయకులు ఉంటున్నారా? లేదా? అనేది కాపులు, కాపు నాయకులు తెలిసికోగలిగితేనే కాపులకు భవిత ఉంటుంది. లేకపోతే కాపుల భవిత జీ హుజూర్ అనే కుల నాయకుల చేతుల్లో బంధీగానే కొనసాగుతుంది.

కీలమైన పదవులు పాలకులకా – కీచులాడుకొనే పప్పుబెల్లాలు మనకా?

ఏ పార్టీ అధికారంలో ఉన్న జిల్లా ఇంచార్జిలు (Districts incharges), కీలకమైన పదవులన్నీ (Key portfolios) కమ్మని దొడ్డలకే (Kammani Doddalu) దక్కుతున్నాయి అనేది నిజం కాదా? జిల్లా ఇంచార్జిలు, కీలకమైన నామినేటెడ్ పదవులు (Nominated Posts), మంత్రి పదవులు, వైస్ ఛాన్సలర్’లు, కలెక్టర్’లు, ఆర్దీవోలు, డీస్పీలు లాంటి ఉన్నత పదవుల్లో అణగారిన వర్గాల వారికీ ఎన్ని దక్కుతున్నాయి? పాలకులకు ఎన్ని దక్కుతున్నాయి? నాలుగు శాతం ఉన్నవారికీ ఎందుకు అంత ఆధిపత్యం? దీనిలో వివక్షత ఉన్నదా? లేదా? ఉంటే అణగారిన వర్గాల నాయకులు దీన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు? అనేది కాపులు, కాపు నాయకులు తెలిసికోగలిగితేనే కాపులకు భవిత ఉంటుంది. లేకపోతే కాపుల భవిత జీ హుజూర్ అనే కుల నాయకుల చేతుల్లో బంధీగానే కొనసాగుతుంది.

కాపులదే రాజ్యాధికారం అనే విషవలయంలో కాపులు?

అణగారిన వర్గాల పార్టీ అధిపతి అయిన పవన్ కళ్యాణ్’ని సీఎం చేస్తాం అనకుండా చిరంజీవి బీజేపీలోకి (BJP) వస్తే సీఎంని చేస్తాం అంటే అంటే అది కుట్రనే అవుతుంది? జనసేనని త్రుంచేయడానికి బీజేపీ వేసే పాచిక అయి ఉంటుంది అని కాపులు తెలుసుకోలేరా?

జనసేనకు మద్దతు నివ్వాలి. జనసేన పార్టీని గెలిపించాలి అని పాలక పార్టీల్లో ఉన్న  కుల నాయకులు చెప్పలేరు. కానీ రాజ్యాధికారం కాపులదే అని మాత్రం అంటారు. ఇది ముమ్మాటికీ జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్’ని అణచివేయడానికి చేస్తున్న విష ప్రచారం? పాలకుల పల్లకీలు మోస్తూ అధికారం కాపులదే అని అనడం అనేదే పెద్ద మోసం? దగా కుట్ర? కాపులు తదితర అణగారిన వర్గాల ఆశల సౌధాన్ని మరొక్కసారి నలిపేసే పెద్ద కుట్ర? ఈ విధంగా కాపులదే అధికారం అనడం ద్వారా అధికారం దక్కని వర్గాలను విషవలయలోకి నెట్టేస్తున్నారా అని కాపులు ఎందకు తెలుసుకోలేక పోతున్నారు?

జనసేనకి పద్దతు నిస్తాం. పవన్ కళ్యాణ్’ని సీఎం చేస్తాం అనకుండా కాపులకు అధికారం దక్కాలి అని కొంత మంది సోదర అణగారిన వర్గ నాయకులు చేసే ప్రచారం కూడా విషపూరితమైనది? ఒక చింతా మోహన్  (Chinta Mohan) చేసే ప్రచారంలో గాని లేదా మరొకరు చేసే ప్రచారంలో గాని స్పష్టత కావాలి. స్పష్టత లేకుండా, జనసేన పేరు చెప్పకుడా పవన్ కళ్యాణ్ పేరు చెప్పకుండా కాపులకు అధికారం రావాలి అనే ప్రచారంలో విషం ఉండవచ్చు? ఇది అణగారిన వర్గాల పార్టీలను పాతాళంలోకి నెట్టేయాలి అనే పాలకుల పాచికల్లో భాగమేమో అని కాపులు తదితర అణగారిన వర్గాల వారు ఎందుకు గ్రహించడం లేదు? అనేది కాపులు, కాపు నాయకులు తెలిసికోగలిగితేనే కాపులకు భవిత ఉంటుంది. లేకపోతే కాపుల భవిత జీ హుజూర్ అనే కుల నాయకుల చేతుల్లో బంధీగానే కొనసాగుతుంది.

కాపులకు జ్ఞాననేత్రాలు…?

ఇన్ని జరుగుతున్నా ఈ మోసాలను కాపులు, కాపు నాయకులు ఎందకు తెలుసుకోలేపోతున్నారు? జనసేనని వదిలేసి, పవన్ కళ్యాణ్ పేరు చెప్పకుండా రాజ్యాధికారం మనదే అంటే ఎలా సాధ్యం అవుతుంది? ఉన్న పార్టీని తొక్కేస్తే పాలక పార్టీలు ఆధిపత్యం కొనసాగదా? పాలకుల తొత్తులు చేస్తున్న ఈ విష ప్రచారాన్ని కాపులు ఎందుకు అర్ధం చేసికోవడం లేదు?

కాపుల హక్కుల (Kapu Rights) గురించి మరిచి కోడిపందాలు (Kodi Pandalu) గురించి మాత్రమే ఉత్తరాలు రాసే పెద్దలను ఎందుకు పూజిస్తున్నారు. కాపు రిజర్వేషన్ ఏమైనది? కుల కార్పొరేషన్ ఏమైనది? జనసేనకు ఎందుకు వోటింగ్ పెరగలేదు అని మాట్లాడే కాపు నాయకుడు ఒక్కరు అంటే ఒక్కరైనా ఈ కాపుల్లో ఉన్నారా? ఏమి మాట్లాడకున్నా కాపులదే అధికారం అనడం మోసం కాదా?

భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలి?

కాపులు చీలికలు పీలికలుగా విడిపోయి కొట్టుకు చస్తున్నారు అనేది అక్షర సత్యం (Akshara Satyam). ఇటువంటి కాపులను, కాపు నాయకులను కలపాలిసిన అవసరం ఎంతైనా ఉన్నది. వీరి జ్ఞాన నేత్రాలు తెరిపించాలిసిన అవసరం ఎంతైనా ఉన్నది. దీనికి చిరంజీవి, ముద్రగడ, లాంటి పెద్దలు ముందుకు రావాలి. అలానే కాపుల్లోను, కాపు అంధ మేధావుల్లోను, కాపు నాయకుల్లో కూడా మార్పు రావాలి. వీరు అంతా కూడా కాపు పెద్దలకి సహకరించాలి. ప్రతీ కాపు తమ జ్ఞాన నేత్రాన్ని తెరవాలి. తోటి సహచర అణగారిన వర్గాలతో కలిసి పనిచేయాలి. జనసేన పార్టీ లాంటి అణగారిన వర్గాల పార్టీల్లో పోటీచేసిన ఎవరిని అయినా సరే  గెలిపించాలి. తతిమ్మా పార్టీల్లో పోటీచేసిన మన కులపోళ్ళని అయినా సరే ఓడించాలి అనే ఆలోచన రావాలి. అది జ్ఞాన నేత్రం తెరిచినప్పుడే రాగలదు అని గ్రహించాలి.  అప్పుడే మనకి రాజ్యాధికారం దక్కుతుంది అనే స్థాయికి కాపులు ఎదగాలి.

“మనోనేత్రం”తో జనసేనాని ఆలోచించాలి

అలానే మార్పు కోసం మేము ముందుకు వస్తాం అనే కాపు నాయకులను, సహచర అణగారిన వర్గాల నాయకులను కలుపుని వెళ్ళాలిసిన బాధ్యత పవన్ కళ్యాణ్’కి కూడా ఉన్నది. ఈ విషయంలో జనసేనానిలో కూడా మార్పు రావాలి. “మభ్యపెట్టేవారి నేత్రం”తో కాకుండా “మనోనేత్రం”తో జనసేనాని ఆలోచించడం మొదలు పెట్టాలి. పార్టీ తలుపులు అందరి కోసం తెరుచుకోవాలి.  అలానే అవసరం అయితే సోదర దళిత, బీసీ వర్గాలతో రాధికారాన్ని పంచుకోవాలి అనే అవగాహన కాపులకు రావాలి.

చిరంజీవి, ముద్రగడలాంటి పెద్దల ప్రోత్సాహం తక్షణమే జనసేనానికి తోడవ్వాలి. అలానే బొత్స, అంబటి, పేర్ని నాని, బోండా ఉమా లాంటి కులనాయకులతో పాటు  అందరి (ప్రతీ కాపు సోదరుడి) జ్ఞాన నేత్రాలు ఇప్పటికైనా తెరుచుకోవాలి. వ్యక్తిగత లేదా జాతిని నిర్వీర్యం చేసే వీరి విమర్శలు మానుకోవాలి జనసేన లాంటి  పార్టీల విజయానికి కాపులంతా సోదర అణగారిన వర్గాలతో, మిగిలిన అగ్ర వర్ణాలతో కలిసి నడుం బిగించాలి. రాజ్యాధికారం సాధించిన రోజునే మా జాతుల మనుగడ సాగుతుంది అనే మనోవికాసం కాపుల్లో రావాలి. అప్పుడే కాపులకి రాజ్యాధికారం (Rajyadhiaram) సిద్ధిస్తుంది.

ఆలోచించండి… తరతరాలుగా పల్లకీలు మోస్తున్నాగాని ఎన్నాళ్లీ పల్లకీలు మోత అనే నా ఆవేదనలో తప్పు ఉంటే మన్నించండి. ఒప్పు అయితే మీ జ్ఞాననేత్రాలను తెరవడానికి ఇప్పటికైనా ప్రయత్నించండి.

–Its from Akshara Satyam

ద్వారకా తిరుమల శ్రీవారికి మూడు కోట్ల ఆదాయం

3 thought on “కాపుల జ్ఞాన నేత్రాలు తెరుచుకుంటేనే రాజ్యాధికారం?”

Comments are closed.