MLA Ki pathramMLA Ki pathram

ఎమ్మెల్యేకు (MLA) వినతి పత్రం అందజేసి తమ గోడుని ఉద్యోగులు విన్నవించుకొన్నారు. రాష్ట్ర జేఏసీ (JAC) పిలుపుమేరకు వారు నిర్దేశించిన కార్యాచరణ అనుగుణంగా అందరూ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించారు. సి పి ఎస్ (CPS) రద్దు, పీఆర్సీ (PRC) వెంటనే విడుదల చేయాలని, పెండింగ్ డిఏలను ఇవ్వాలని… మరియు కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను (Outsourcing employees) క్రమబద్ధీకరణ మొదలగు తమ న్యాయమైన కోర్కెల సాధన కొరకు డిమాండ్ చేశారు. వాటిని సాధించే తరుణంలో మంగళవారం జంగారెడ్డిగూడెం మండల పరషత్ కార్యాలయము లో చింతలపూడి శాసనసభ్యులు శ్రీ ఉన్నమట్ల ఎలేజా కీ ఉద్యోగులందరూ వినతి పత్రం అందజేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క సంఘీభావాన్ని తెలిపారు. ఈ కార్యక్రమానికి పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధనకార్యదర్శి చుక్కా గోపాకృష్ణ, జిల్లా పంచాయతీ కార్యదర్శులు, సంఘము అధ్యక్షులు పగడం నాగేశ్వరరావు… డివిజన్ NGO ఉపాధ్యక్షులు, SNB సత్యవేణి, ఇంకా ఉద్యోగులు JNV విజయకుమార్, G. సుబ్బలక్ష్మి తదితరులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క సంఘీభావాన్ని తెలియజేసారు.

–Garuvu Babu Rao from Jangareddygudem

అయ్యప్ప స్వామికి 12 వేల డమరకం వితరణ