ప్రారంభమైన కంపెనీలనే మళ్లీ ప్రారంభిస్తున్నట్టు చూపారు!!
విశాఖ పెట్టుబడుల సదస్సు (Global Investors summit) అంకెల గారడీగా మారింది అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ మరొక జనసేన కార్టూన్ (Janasena cartoon) విడుదల చేసారు. గతంలో ప్రారంభమైన కంపెనీలనే మళ్లీ ప్రారంభిస్తున్నట్టు విశాఖ పెట్టుబడుల సదస్సులో చూపారని జనసేన వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నది.
వైసీపీ ప్రభుత్వంపై (YCP Government) ఏపీ సీఎం జగన్ రెడ్డిపై (AP CM Jagan Reddy)
జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో విడుదల చేస్తున్న జనసేనాని కార్టూన్ (Janasenani Cartoon) పర్వం కొనసాగుతూనే ఉన్నది.
2024 లో రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీ వ్యూహాలు చిత్తు అవుతాయి. జగన్ ప్రభుత్వం పడిపోతుంది అనే అర్ధం వచ్చేటట్లు జనసేనాని పవన్ కళ్యాణ్ తన వంగ్య కార్టూన్ల పరంపరను కొనసాగిస్తూనే ఉన్నారు.
జగనన్న ప్రభుత్వంపై జనసేనాని పవన్ కళ్యాణ్ విడుదల చేస్తున్న కార్టూన్లపై వైసీపీ నాయకులు కూడా పవన్ కళ్యాణ్’కి ఘాటుగానే ప్రతిస్పందిస్తున్నారు. మొత్తం మీద ఏపీ రాజకీయాలు వైసీపీ-జనసేనల మధ్య రసవత్తరంగానే కోనసాగుతున్నాయి అని చెప్పాలి.