AP CM JaganAP CM Jagan

నామినేటెడ్ పదవుల నియమించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) వివిధ నామినేటెడ్ పదవులను (Nominated posts) ప్రకటించింది. ఈ నామినేటెడ్‌ పోస్టుల వివరాలను మంత్రులు రాష్ట్ర హోంమంత్రి (Home Minister) మేకతోటి సుచరిత, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ శనివారం ప్రకటించారు. పోస్టుల భర్తీలో సామాజిక న్యాయానికి (Social Justice) పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Jagan Mohan Reddy) నిర్ణయం తీసుకున్నారు అని ప్రభుత్వం ప్రకటిస్తున్నది. అయితే నిజానికి జరిగిన సామాజిక న్యాయం ఎంత అనేదే ప్రశ్న? దీనికి సమాధానం చెప్పే ప్రయత్నాన్ని వివిధ కులసంఘాలు గాని, వివిధ సామాజిక వర్గాల నుండి వచ్చిన రాజకీయ నాయకులు చేయగలరా? లేకపోతే దీనికి కారణం ఏమిటి?

సామాజిక న్యాయం జరిగిందా?

ఓసీలకు మొత్తం 58 నామినేటెడ్ పదవులు దక్కగా అందులో 26 పదవులను ఒక్క పాలక సామాజిక వర్గమే దక్కించుకున్నట్లు తెలుస్తున్నది. మిగిలిన పదవుల్లో కాపులకి 18 , కమ్మ వారికి 6 , రాజులకి 4 , వైశ్యలకు 3 , బ్రాహ్మణులకు 1 దక్కినట్లు తెలుస్తున్నది.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు జనాభా సుమారు 67 % పైనే ఉన్నారు. అయితే వీరికి మాత్రం కేవలం 56 శాతం పదవులు మాత్రమే కేటాయించారు. 137 పోస్టుల్లో మహిళలకు 69, పురుషులకు 68 పదవులు ఇచ్చారు. రాష్ట్ర జనాభాలో కాపు తదితర కులాలు సుమారు 27 % ఉన్నారు. వీరికి సుమారు 36 నామినేటెడ్ పదవులు రావాల్సి ఉంది. కానీ కాపులకి కేవలం 18 నామినేటెడ్ పదవులను మాత్రమే ఇచ్చారు. రాష్ట్ర జనాభాలో పాలక సామాజిక వర్గం జనాభాలో సుమారు 5 % ఉండవచ్చు. కానీ వీరికి 19 . 5 % ఈ నామినేటెడ్ పదవులను కట్టబెట్టినట్లు తెలుస్తున్నది. మరొక పాలక వర్గానికి కూడా వారి జనాభా నిష్పత్తి కంటే కొద్దిగా ఎక్కువనేకట్టబెట్టినట్లు తెలుస్తున్నది.

నాలుగు శాతం కూడా లేని పాలక వర్గానికి 19 . 5 % పదవులు కట్టబెట్టి. , మిగిలిన వర్గాలకు తక్కువగా ఇస్తే సామాజిక న్యాయం జరిగింది అని ఎలా అనుకోవాలి? వివిధ కుల సంఘాలు, నాయకులు సామాజిక న్యాయం జరిగిందా లేకా అని ఎందుకు ప్రశ్నించడం లేదు? తగిన వివరాలతో ప్రభుత్వం వచ్చి, ఇది అవాస్తవం అని చెప్పగలదా? వాస్తవం అయితే సరిచేయగలదా అనేదే అక్షర సత్యం ఆవేదన?

వివిధ నామినేటెడ్‌ పోస్టులను ఎవరెవరు దక్కించుకున్నారు?

కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా అడపా శేషు.
క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పాతపాటి సర్రాజు.
కమ్మ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా తుమ్మల చంద్రశేఖర్‌.
బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్‌గా సుధాకర్‌.
రెడ్డి కార్పొరేషన్ ఛైర్మన్‌గా చింతలచెరువు సత్యనారాయణరెడ్డి.

ఏపీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌గా ఎ.మల్లికార్జునరెడ్డి.
ఏపీఐఐసీ ఛైర్మన్‌గా మెట్టు గోవిందరెడ్డి.
వక్ఫ్‌బోర్డ్‌ ఛైర్మన్‌గా ఖాదర్ బాషా.
శ్రీశైలం దేవస్థానం బోర్డు ఛైర్మన్‌గా రెడ్డివారి చక్రపాణిరెడ్డి.
శ్రీకాళహస్తి దేవస్థానం బోర్డు ఛైర్మన్‌గా బి. బీరేంద్రవర్మ.

కాణిపాకం దేవస్థానం బోర్డు ఛైర్మన్‌గా రెడ్డి ప్రమీలమ్మ.
ఉమెన్స్ కోపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా హేమమాలినిరెడ్డి.
గ్రీనింగ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నర్తు రామారావు.
ఉపాధి కల్పన అభివృద్ధి సొసైటీ ఛైర్మన్‌గా శ్యాంప్రసాద్‌రెడ్డి.
ఏపీ మారిటైం బోర్డ్‌ ఛైర్మన్‌గా కాయల వెంకటరెడ్డి.
ఏపీ టిడ్కో ఛైర్మన్‌గా జమ్మన ప్రసన్నకుమార్‌.
ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా మొండితోక అరుణ్‌కుమార్‌.

మైనారిటీస్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా షేక్‌ ఆసిఫ్‌.
హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా దవులూరి దొరబాబు.
నాట్యకళ అకాడమీ ఛైర్మన్‌గా కుడుపూడి సత్య శైలజ.
సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అకాడమీ ఛైర్‌పర్సన్‌గా టి.ప్రభావతి.
సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ద్వారంపూడి భాస్కర్‌రెడ్డి.
రూరల్‌ వాటర్‌ సప్లై సలహాదారుగా బొంతు రాజేశ్వరరావు.
ఎంఎస్‌ఎంఈ కార్పొరేషన్ ఛైర్మన్‌గా వంకా రవీంద్రనాథ్‌.

కార్మిక సంక్షేమ బోర్డు వైస్‌ఛైర్మన్‌గా దాయల నవీన్‌బాబు.
సాహిత్య అకాడమీ ఛైర్‌పర్సన్‌గా పిల్లంగొల్ల శ్రీలక్ష్మి.
రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా కనుమూరి సుబ్బరాజు.
కనీస వేతన సలహా బోర్డు ఛైర్‌పర్సన్‌గా బర్రి లీల.
సీడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌గా సుస్మిత.
స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌గా పొనాక దేవసేన.
రాష్ట్ర ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా మేరుగ మురళీధర్‌.

సంగీత నృత్య అకాడమీ ఛైర్‌పర్సన్‌గా పొట్టెల శిరీష యాదవ్‌.
ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌సోర్స్‌డ్‌ ఎంప్లాయిస్‌ ఛైర్మన్‌గా షేక్‌ సైదాని.
పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా మెట్టుకూరు చిరంజీవిరెడ్డి.
ఆగ్రో డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నవీన్‌ నిశ్చల్‌.
ఉర్దూ అకాడమీ ఛైర్మన్‌గా నదీం అహ్మద్‌.
నాటక అకాడమీ ఛైర్మన్‌గా యెట్టి హరిత.

APSRTC

APSRTC రీజనల్‌ బోర్డ్‌ ఛైర్మన్‌గా ఎం.మంజుల (అనంతపురం).
APSRTC రీజనల్‌ బోర్డ్‌ ఛైర్‌పర్సన్‌గా జి.బంగారమ్మ (విజయనగరం).
APSRTC రీజనల్‌ బోర్డు ఛైర్మన్‌గా తాతినేని పద్మావతి (కృష్ణా).
APSRTC రీజనల్‌ బోర్డ్‌ ఛైర్మన్‌గా మెట్టపల్లి చిన్నప్పరెడ్డి విజయానందరెడ్డి.
APSRTC రీజనల్‌ బోర్డ్‌ ఛైర్మన్‌గా బత్తుల సుప్రజ.

విద్యాసంస్థలు, వసతుల కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా మళ్ల విజయప్రసాద్‌.
న్యూ అండ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ (NEDCAP) ఛైర్మన్‌గా కె.కన్నప్పరాజు.
క్రిస్టియన్‌ మైనారిటీస్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా బొల్లవరపు జాన్‌వెస్లీ.
బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా సీతంరాజు సుధాకర్‌.
సామాజిక న్యాయ సలహాదారుగా జూపూడి ప్రభాకర్‌రావు.

రాష్ట్ర మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా షమీమ్‌ అస్లామ్‌.
ఫోక్‌ అండ్‌ క్రియేటివిటీ అకాడమీ ఛైర్మన్‌గా కొండవీటి నాగభూషణం.
లెదర్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా కాకుమాను రాజశేఖర్‌.
సొసైటీ ఫర్‌ ఆంధ్రప్రదేశ్‌ నెట్‌వర్క్‌(SAPNET) ఛైర్మన్‌గా బాచిన కృష్ణచైతన్య.
రాష్ట్ర టైలర్‌ డెవలప్‌మెంట్‌ కోపరేటివ్‌ ఫెడరేషన్‌ ఛైర్మన్‌గా షేక్‌ సుభాషిణి.
రాష్ట్ర పర్యావరణ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా గుబ్బ చంద్రశేఖర్‌.

పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ఆరెమండ వరప్రసాద్‌రెడ్డి.
హ్యాండిక్యాప్‌ అండ్‌ సీనియర్‌ సిటిజన్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ముంతాజ్‌ పఠాన్‌.
షేక్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా షేక్‌ ఆషా బేగం.
హిస్టరీ అకాడమీ ఛైర్మన్‌గా కుర్రా నాగమల్లేశ్వరి.
గ్రంథాలయ పరిషత్‌ ఛైర్మన్‌గా మందపాటి శేషగిరిరావు.
స్పోర్ట్‌ అథారిటీ ఛైర్మన్‌గా బైరెడ్డి సిద్దార్థరెడ్డి.

ఏపీ ఖాదీ మరియు విలేజ్‌ ఇండస్ట్రీస్‌ బోర్డ్‌ ఛైర్మన్‌గా పెర్లప్పగారి భాగ్యమ్మ.
మార్క్‌ఫెడ్‌ ఛైర్మన్‌గా పమిరెడ్డిగారి పెద్దనాగిరెడ్డి.
ఏపీ ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా కర్ర గిరిజ.
ఏపీ మీట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా మాదిగ శ్రీరాములు.
ఏపీ ఆయిల్‌ ఫెడరేషన్ ఛైర్మన్‌గా షేక్‌ గౌసియా బేగం.
రాష్ట్ర వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా కరీముల్లా షేక్‌ అమీన్‌.
APCOB ఛైర్మన్‌గా మల్లెల ఝాన్సీరెడ్డి.

హ్యండ్‌క్రాఫ్ట్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా బడిగించల విజయలక్ష్మి.
రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డ్‌ ఛైర్మన్‌గా పులి సునీల్‌కుమార్‌.
రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా కోడూరు అజయ్‌రెడ్డి.
రాష్ట్ర హజ్‌ కమిటీ ఛైర్మన్‌గా బద్వేల్‌ షేక్‌ గౌస్‌ లాజమ్‌.
అర్బన్‌ ఫైనాన్స్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా వి.లీలావతి.

జిల్లా సంబంధిత నామినేటెడ్ పదవులు:

జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా సువ్వారి సువర్ణ (శ్రీకాకుళం).
అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా కోరాడ ఆశాలత (శ్రీకాకుళం).
కోపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ ఛైర్‌పర్సన్‌గా చల్లా సుగుణ (శ్రీకాకుళం).
డీసీసీబీ ఛైర్మన్‌గా కరిమి రాజేశ్వరరావు (శ్రీకాకుళం).

జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా రెడ్డి పద్మావతి (విజయనగరం).
బొబ్బిలి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్‌పర్సన్‌గా పార్వతి.
డీసీఎంఎస్‌ ఛైర్మన్‌గా అవనాపు భావన (విజయనగరం).
డీసీసీబీ ఛైర్మన్‌గా నెక్కల నాయుడుబాబు (విజయనగరం).

VKPCPIR ఛైర్మన్‌గా చొక్కాకుల లక్ష్మి (విశాఖ).
VMRDA ఛైర్మన్‌గా అక్రమాని విజయనిర్మల (విశాఖ).
విశాఖ స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌గా జి.వెంకటేశ్వరరావు (విశాఖ).
జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా కొండా రమాదేవి (విశాఖ).
జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ ఛైర్మన్‌గా పళ్ల చిన్నతల్లి (విశాఖ).
జిల్లా సహకార సెంట్రల్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌గా సీహెచ్‌.అనిత (విశాఖ).

తూర్పు గోదావరికి సంబంధించి

రాజమండ్రి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా ఎం.షర్మిలారెడ్డి.
రాజమండ్రి స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా చందన నగేష్‌.
కాకినాడ స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా రాజబాబు యాదవ్‌.
హితకారిణి సమాజం ఛైర్మన్‌గా మునికుమారి (తూ.గో).
ఏలేశ్వరం డెవలప్‌మెంట్‌ బోర్డు ఛైర్మన్‌గా తోలాడ శైలజ పార్వతి.
జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా దూలం పద్మ (తూ.గో).
కాకినాడ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా రాగిరెడ్డి దీప్తి.
సహకార మార్కెటింగ్‌ సొసైటీ ఛైర్మన్‌గా మణికుమారి (తూ.గో).

రాజమండ్రి అర్బన్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌గా గిరిజాల తులసి.
ఈస్టర్న్‌ డెల్టా బోర్డ్‌ ఛైర్మన్‌గా ఏడిద చక్రపాణిరావు (తూ.గో).
సహకార సెంట్రల్‌ బ్యాంక్ ‌ఛైర్మన్‌గా ఆకుల వీర్రాజు (తూ.గో).
సెంట్రల్‌ డెల్టా బోర్డ్‌ ఛైర్మన్‌గా కుడుపూడి వెంకటేశ్వర్ (తూ.గో).

పశ్చిమ గోదావరికి సంబంధించి

ఏలూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా ఎం.ఈశ్వరి.
ఏలూరు స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా బొడ్డాని అఖిల.
జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా చిర్ల పద్మశ్రీ (ప.గో).
వెస్టర్న్‌ డెల్టా బోర్డ్‌ ఛైర్మన్‌గా గంజిమాల దేవి (ప.గో).
జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ ఛైర్మన్‌గా వేండ్ర వెంకటస్వామి (ప.గో).
జిల్లా సహకార సెంట్రల్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌గా పీవీఎల్‌ నరసింహరావు (ప.గో).

కృష్ణా జిల్లాకి సంబంధించి

జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా తిప్పరమల్లి పూర్ణమ్మ (కృష్ణా)
కోపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ ఛైర్మన్‌గా పడమట స్నిగ్ధ (కృష్ణా)
అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా భవాని (కృష్ణా)
సహకార సెంట్రల్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌గా తన్నేరు నాగేశ్వరరావు (కృష్ణా).

జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా బత్తుల దేవానంద్‌ (గుంటూరు)
జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ ఛైర్మన్‌గా వై.భాగ్యలక్ష్మి (గుంటూరు)
జిల్లా సహకార సెంట్రల్‌ బ్యాంక్ ఛైర్మన్‌గా సీతారామాంజనేయులు (గుంటూరు).

ఒంగోలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా ఎస్‌.మీనాకుమారి (ప్రకాశం)
జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా రాచగొర్ల వెంకట సుశీల (ప్రకాశం)
జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ ఛైర్మన్‌గా రావి పద్మావతి (ప్రకాశం)
జిల్లా సహకార సెంట్రల్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌గా మాదాశి వెంకయ్య (ప్రకాశం).

నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా ఎం.ద్వారకానాథ్‌
జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా డి.శారద (నెల్లూరు)
జిల్లా సహకార సెంట్రల్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌గా కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి (నెల్లూరు)
జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ ఛైర్మన్‌గా వి.చలపతి (నెల్లూరు).

తిరుపతి స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నారమల్లి పద్మజ
జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ ఛైర్మన్‌గా సామకోటి నాగలక్ష్మి (చిత్తూరు)
జిల్లా సహకార సెంట్రల్‌ బ్యాంక్‌(DCCB) ఛైర్మన్‌గా ఎం.రెడ్డమ్మ (చిత్తూరు)
జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా నైనార్‌ మధుబాల (చిత్తూరు)
పలమనేరు-కుప్పం-మదనపల్లి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ఛైర్మన్‌గా వెంకట్‌రెడ్డి యాదవ్‌.

కర్నూలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి
జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా మద్దూరు సుభాష్‌ చంద్రబోస్‌ (కర్నూలు)
జిల్లా సహకార సెంట్రల్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌గా సన్నాల మహలక్ష్మి (కర్నూలు)
జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ ఛైర్మన్‌గా చెంచన్నగారి శిరోమణి (కర్నూలు).

AHUDA ఛైర్మన్‌గా మహాలక్ష్మి శ్రీనివాసులు (అనంతపురం)
జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా లోమాడ ఉమాదేవి (అనంతపురం)
పుట్టపర్తి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా లక్ష్మీనరసింహ
జిల్లా సహకార సెంట్రల్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌గా మానుకింద లిఖిత (అనంతపురం)
జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ ఛైర్మన్‌గా టి.చంద్రశేఖర్‌రెడ్డి (అనంతపురం).

జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా ఎల్‌.ఉషారాణి (వైఎస్‌ఆర్‌ జిల్లా)
అన్నమయ్య అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా గురుమోహన్‌
జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ ఛైర్మన్‌గా చంద్రలీల (వైఎస్‌ఆర్‌ జిల్లా).

జీసీసీ ఛైర్‌పర్సన్‌గా శోభాస్వాతిరాణి (విజయనగరం)
ట్రైకార్‌ ఛైర్మన్‌గా సటక బుల్లిబాబు (విశాఖపట్నం).

అంతర్జాలంలో అందుతున్న జనాభా లెక్కలు, పదవులు పొందిన వారి సంఖ్యను బట్టి శాతాలు లెక్కగట్టడమైనది అని భావించగలరు.

–Akshara Satyam