Maddi anjaneya Swamy-DasamiMaddi anjaneya Swamy-Dasami

శరన్నవరాత్రులు మంగళవారం సందర్భముగా మద్ది ఆంజనేయ స్వామి ఆలయం (Maddi Anjaneya Swamy Temple) లో విజయదశమి (Vijaya Dashami) సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం మండలము, గురవాయిగూడెం గ్రామము నందు తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభువులై వెలిసిన మద్ది ఆంజనేయస్వామి వారి దర్శనార్ధము చుట్టు ప్రక్కల గ్రామ, ప్రాంతముల నుండి అత్య అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసారు. విచ్చేసిన భక్తులు స్వామి వారి ఆలయము చుట్టూ 108 ప్రదక్షణలు చేసి, మొక్కుబడులు తీర్చుకున్నారు.

ఆంజనేయ స్వామి (Anjaneya Swamy) వారికి అత్యంత ప్రీతికరమైన తమలపాకులు (నాగవల్లీ దళములు)తో అష్టోత్తరం పూజలను, అన్నప్రాసనలు, వాహనం పూజలను నిర్వహించుకున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణ వాసులు వాసా చంద్రశేఖర రావు దంపతులు స్వామి వారికి రూ.50,000/-లు కానుకగా ఆలయ పర్యవేక్షకులు వారి చేతుల మీదుగా స్వామి వారికి అందజేసారు.

మద్యాహ్నం గం.02.30 ని.ల.వరకు సామి వారి దేవస్థానమునకు వివిధ సేవల రూపేణ రూ. 2,20,187/- లు సమకూరినదని ఆలయ అధికారులు తెలిపారు. స్వామి వారి దర్శనమునకు విచ్చేసిన సుమారు 2100 మంది భక్తులకు స్వామి వారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ జరుపబడినది. స్వామి వారి దర్శనముంకు విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా ఆలయ పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ ధర్మకర్తల మండలి అద్యక్షురాలు శ్రీమతి సరితా విజయభాస్కర రెడ్డి, మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు ఒక ప్రకటనలో తెలిపారు.

–జంగారెడ్డిగూడెం నుండి గరువు బాబురావు

కేంద్ర మాజీ మంత్రి కృష్ణం రాజుకు ఘనంగా నివాళి!