Rajampeta JSPRajampeta JSP

రాయచోటి (Rayachoti) వద్దు.రాజంపేటను (Rajampet) జిల్లా కేంద్రంగా చేయాలని రాజంపేట జనసేన పార్టీ (Janasena Party) పోరాటం మొదలు పెట్టింది. జనసేన పార్టీ రాజంపేట ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు రాజంపేట జనసేన నాయకురాలు పోలిశెట్టి రజిత ఆధ్వర్యంలో రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని నినాదాలు చేశారు.

రాయచోటి వద్దు రాజంపేట ముద్దు అనే నినాదాలను జనసేన నాయకులు (Janasena Leavers) చేసి నిరసన వ్యక్తం చేశారు. జిల్లాల విభజనతో రాజంపేటకు తీరని అన్యాయం జరుగుతుందని జనసేన నాయకురాలు పోలిశెట్టి రజిత ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నారు. ఏవనరులు లేకుండా రాయచోటిని జిల్లా కేంద్రంగా ఎలా చేస్తారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు . ఎటువంటి సౌకర్యాలు లేని రాయచోటి జిల్లా కేంద్రంగా ప్రకటించడం అన్యాయమని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) పునరాలోచన చేసి రాజంపేటను అన్నమయ్య జిల్లా (Annamayya District) కేంద్రంగా ప్రకటించాలన్నారు.

ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య, పోలిశెట్టి రమణయ్య, సుబ్బరాయుడు, కిషోర్ , విజయ, లక్ష్మి దేవి, జయంతి, జానకి, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

జనసేన పిఎసి సభ్యునిగా చేగొండి సూర్యప్రకాష్