DIG NanganathDIG Nanganath

కాకరేపుతున్న గంజాయి రవాణా
అధికారుల్లో ఆవేదన – అధికార పార్టీల్లో ఆందోళన

గంజాయి ఆపరేషన్ (Ganja Operation) విషయంలో వై.ఎస్.ఆర్. సిపి (YSRCP) పార్లమెంట్ సభ్యుడు (MP) విజయ సాయి రెడ్డి (Vijaya Sai Reddy) చేసిన వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి. తెలంగాణా రాష్ట్రంలోని (Telangana State) ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సరిహద్దు జిల్లా పోలీస్ అధికారి పేరుతో అయన చేసిన ప్రకటనలు నల్లగొండ ఎస్పీ ఏ.వి. రంగనాధ్’కి (A V Ranganath) ఆవేదన కలిగిస్తున్నాయి. విజయ సాయి చేసిన ఆ వ్యాఖ్యలు పరోక్షంగా తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలుగా భావిస్తున్నారు. అందుచేతనే జరిగిన వాస్తవాలను తెలియజేయడం కోసం నల్లగొండ ఎస్పీ ఏ.వి. రంగనాధ్ ఒక ప్రకటన విడుదల చేశారు.

గంజాయి సమస్య ఏ.వో.బి.లో (AOB) కొత్తగా ఉత్పన్నం కాలేదు. గత పదిహేను సంవత్సరాల నుండి ఈ సమస్య ఉన్న విషయం సీనియర్ పోలీస్ అధికారులందరికి తెలుసని రంగనాధ్ తెలిపారు. వై.ఎస్.ఆర్. సిపి పార్లమెంట్ సభ్యుడు విజయ సాయి రెడ్డి తనపై చేసిన పలు ఆరోపణలను రంగనాధ్ తీవ్రంగా ఖండించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు (Chandra Babu Naidu), తెలుగుదేశం (Telugu Desam) పార్టీకి తాను దగ్గరగా ఉంటానని ఆయన చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా తాను చెప్పడం వల్లనే కర్నాటక, తెలంగాణ (Telangana), మహారాష్ట్ర (Maharashtra), మధ్యప్రదేశ్ (Madhya Pradesh) పోలీస్ అధికారులు (Police Officers) గంజాయి కోసం ఏ.వో.బి. ప్రాంతంలో దాడులు చేస్తున్నారని చెస్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల కోసం నిరంతరం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పని చేస్తున్న దేశంలోని పలు రాష్ట్రాల, పోలీసులకు దురుదేశాన్ని అపాదిస్తూ తక్కువ చేయడం సరికాదని చెప్పారు. ఒక పార్లమెంట్ సభ్యుని హోదాలో ఉన్న విజయసాయి రెడ్డి గంజాయి అంశంలో సరైన సమాచారం లేకపోవడం వల్లనో, తప్పుడు సమాచారం కారణంగానో తనపై ఆరోపణలు చేస్తున్నట్లుగా అనిపిస్తోందని రంగనాధ్ చెప్పారు.

అసలు నిజం ఏమిటి…..

ఏ.వో.బి. ప్రాంతంలో గంజాయి సాగు చేస్తున్న సమస్య ఇప్పటిది కాదు. ముఖ్యంగా ఆంధ్రా – ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలోని విశాఖపట్నం (Visakhapatnam) రూరల్, తూర్పు గోదావరి (East Godavari), మల్కన్ గిరి జిల్లాలలో సాగులో ఉన్నది. ఈ అటవీ ప్రాంతంలో (Forest Area) గత 15 సంవత్సరాలుగా వేల ఎకరాలలో సాగు చేస్తున్నారు. అక్కడి గిరిజనులు గంజాయినే ఎక్కువగా సాగు చేస్తున్న విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే అని ఆయన చెప్పారు. కరోనా (కోవిడ్) తర్వాత గంజాయి వినియోగం దేశ వ్యాప్తంగా, ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాలలో పెరిగిపోయిందని ఆయన చెప్పారు. దీనికి ప్రధాన కారణం లాక్ డౌన్ (Lock Down) సమయంలో అనేక మంది గంజాయి వాడకందారులు దేశంలోని ప్రధాన నగరాల నుండి గ్రామీణ ప్రాంతాలకు తరలి వెళ్లారు. తద్వారా తమ స్వంత గ్రామాలకు రావడంతో గంజాయి సేవించే అలవాటును గ్రామీణ యువతకు, ప్రజలకు అంటించారని ఆయన తెలిపారు. కోవిడ్ కారణంగా దేశ వ్యాప్తంగా అనేక మంది ఉపాధిని కోల్పోయారు. వారిలో చెడు వ్యసనాలకు బానిసలుగా మారిన యువత గంజాయి రవాణాను ఉపాధి మార్గంగా ఎంచుకున్నారు.

డబ్బులు సంపాదించడం కోసమే వీరు గంజాయిని పెద్ద ఎత్తున రవాణా కావడానికి మరో ప్రధాన కారణమని వివరించారు. ఈ క్రమంలోనే ఏ.వో.బి. ప్రాంతం నుండి గంజాయి రవాణా తెలంగాణలోనికే కాకుండా దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించిందని చెప్పారు. దీని కారణంగానే దేశ వ్యాప్తంగా కోట్లాది మంది యువత గంజాయికి బానిసలుగా మారి ఎన్నో కుటుంబాలు విచ్చిన్నం అయ్యాయి. అంతేకాక దేశ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఏర్పడింది. గంజాయి కారణంగా అసాంఘిక కార్యకలాపాలు, నేరాల సంఖ్య పెరిగిపోతున్నదని రంగనాథ్ చెప్పారు.

ఏ.వో.బి.లో అసలేం జరిగింది….

యువత (Youth) గంజాయికి అలవాటు పడి దానికి బానిసలుగా మారుతున్నారు. దీనితో వారి బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గుర్తించారు. అందుచేతనే సెప్టెంబర్ మొదటి వారంలో తెలంగాణ పోలీసులకు గంజాయి నిర్ములనపై స్పష్టమైన దిశా నిర్దేశం కెసిఆర్ చేశారు. అందులో ముఖ్యంగా తెలంగాణను గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కేసీర్ ఆదేశించారు. ఇందుకోసం తెలంగాణ పోలీసులు గంజాయి రవాణా, నెట్ వర్క్’పై పటిష్ట నిఘా పెట్టాలని అదేశించారని రంగనాధ్ తెలిపారు.

ముఖ్యమంత్రి (Chief Minister) ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన నెలన్నర కాలంలో తనికీలు ముమ్మరం చేశారు. నల్లగొండ జిల్లాలో గంజాయి రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టి ముమ్మరంగా తనిఖీలు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. భౌగోళికంగా నల్లగొండ (Nalgonda District) జిల్లా ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉండే జిల్లా. ఇది జాతీయ రహదారి – 65 నల్లగొండ జిల్లా మీదుగా వెళుతుంది. ఏ.వో.బి. నుండి నల్లగొండ మీదుగా హైదరాబాద్ (Hyderabad), తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. అలానే దేశంలోని ఇతర రాష్ట్రాలకు గంజాయిని ఈ జాతీయ రహదారి మీదుగా రవాణా అవుతున్నది. ఈ క్రమంలోనే నల్లగొండ జిల్లా పోలీసులు నిర్వహించిన తనిఖీలలో వేల కిలోల గంజాయి ఏ.వో.బి. ప్రాంతం నుండి రవాణా అవుతున్నది. దీన్ని తమ జిల్లాలో పట్టుకోవడం జరిగింది. సుమారు 35 కేసులు కూడా నమోదు చేయడం జరిగిందని రంగనాథ్ తెలిపారు. గంజాయి రవాణాలో పట్టుబడిన నిందితులు అందరూ విచారణలో వివరాలు వెల్లడించారు. గంజాయిని ఏ.వో.బి. ప్రాంతం నుండి తీసుకు వస్తున్నట్లుగా కూడా చెప్పారని రంగనాధ్ వివరించారు. ఇదే విషయాన్ని నిందితుల కాల్ డేటాతో పాటు సాంకేతిక ఆధారాలతో సహా నిర్ధారించినట్లు వివరించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) అక్టోబర్ 20వ తేదీన ప్రగతి భవన్’ (Pragathi bhavan)లో గంజాయి అంశాన్ని మరోసారి సమగ్రంగా సమీక్షించి గంజాయిని తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా నిర్ములించాలని సీనియర్ పోలీస్, ఎక్సయిజ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు మరోసారి ఇచ్చారని రంగనాథ్ వివరించారు.

ఏ.వో.బి.లో గంజాయి ఆపరేషన్….

తాము గంజాయిపై నిర్వహించిన ప్రతి తనిఖీలో దాని మూలాలు ఏ.వో.బి. వైపు చూపించాయి. నల్లగొండ జిల్లాలో పట్టుబడిన ప్రతి గంజాయి నేరస్థుడు విచారణ (ఇంటరాగేషన్) లో పూర్తి వివరాలు చెప్పారు. ఏ.వో.బి. ప్రాంతం నుండి ఎవరెవరు విక్రయిస్తున్నారు, ఎవరు వ్యాపారం చేస్తున్నారనే విషయాలను వారి పేర్లు, ఊరి పేర్లతో సహా గుర్తించడం జరిగిందని రంగనాథ్ తెలిపారు. ఇదే సమయంలో నల్లగొండ పోలీస్ బృందాలు ఏ.వో.బి. (SOURCE) తో పాటుగా గంజాయిని తరలిస్తున్న గుర్తించారు. తెలంగాణలోని హైదరాబాద్ (దూల్ పేట), ఆదిలాబాద్, మహబూబాబాద్, భద్రాచలం, సంగారెడ్డి, నారాయణపేటతో సహా పలు జిల్లాలలో దాడులు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.

విజయ దశమి (Vijaya Dashami) రోజున నల్లగొండ జిల్లాకు చెందిన 17 పోలీస్ బృందాలు ఆపరేషన్ గంజా ఇన్ ఏ.వో.బి ప్రారంభించడం జరిగిందన్నారు. ఇదే విషయాన్ని తాను స్వయంగా విశాఖ రురల్ ఎస్పీ కృష్ణారావు, తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు లతో మాట్లాడడం జరిగిందని స్పష్టం చేశారు. నల్లగొండ నుండి డిటిసి ఎస్పీ సతీష్ చోడగిరిని ప్రత్యేక అధికారిగా ఏ.వో.బి. ప్రాంతానికి వెళ్లిన బృందాలను సమన్వయం చేయడానికి పంపించడం జరిగింది. ఆయన వైజాగ్ రూరల్ జిల్లా పోలీస్ గెస్ట్ హౌస్ లో మూడు రోజుల పాటు (అక్టోబర్ 15 నుండి 17 వరకు) ఉన్నారు. విశాఖ రూరల్ ఎస్పీ ని సైతం కలవడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ మొత్తం ఆపరేషన్ లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు పూర్తి సహాయ, సహకారాలు అందించారు. నేరస్తులను పట్టుకోవడంలో ఆంధ్ర పోలీసులు అన్ని రకాలుగా సహకరించారని స్పష్టం చేశారు.

అదే విదంగా నల్లగొండ పోలీస్ బృందాలు ఏ.వో.బి.లోని తీవ్ర నక్సల్స్ ప్రభావిత మారుమూల గ్రామాలలో ఉంటూ గంజాయి వ్యాపారం చేస్తున్న వారిని ప్రాణాలకు తెగించి మెరుపు దాడులు చేశారు. అలా చేయడంతో పాటు వారిని అరెస్టు చేయడం కూడా జరిగిందన్నారు. ఆత్మరక్షణ కోసం వారిపై కాల్పులు చేయడం జరిగింది. ఆవిధంగా ఆక్రోబర్ 17వ తేదీన చింతపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లంబసింగి వద్ద తమ పోలీస్ బృందాలను గంజాయి ముఠాల నుండి కాపాడు కోవడం జరిగింది అని అన్నారు. ఈ ఆపరేషన్ లో వెయ్యి కిలోలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు రంగనాధ్ వివరించారు. ఆపరేషన్ గంజాయి ముఖ్యంగా నల్లగొండ పోలీసుల కాల్పుల ఘటనకు సంబంధించిన అన్ని విషయాలను అక్టోబర్ 18 రోజున నల్లగొండలో తాను మీడియాకు వెల్లడించినట్లు ఎస్పీ రంగనాధ్ చెప్పారు. ఇందుకు సంబంధించి తాము విచారణలో తెలుసుకున్న అంశాలను, ఏ.వో.బి. గంజాయి నెట్వర్క్ కు సంబందించిన పూర్తి సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులకు నివేదిస్తామని ఆయన వివరించారు.

ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి….

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అన్ని రాజకీయ పార్టీలు (Political Parties) గంజాయి ఆపరేషన్ విషయంలో చేస్తున్న రాజకీయంలో పోలీసులను, ప్రత్యేకించి తనను లాగడం సరి కాదు. మా భుజాల మీద నుండి మీ రాజకీయ అస్త్రాలను సంధించడం దురదృష్టకరమని రంగనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. తాము గంజాయి ఆపరేషన్, గంజాయి వ్యాపారం, రవాణా పై చేసిన ప్రకటనలను ఆంధ్రా రాజకీయ పార్టీల నాయకులు ఎవరికి కావాల్సిన విధంగా వారు అన్వయించుకుంటున్నారు. వారి రాజకీయ ప్రయోజనాల కోసం తమను వాడుకోవడం సరైన విధానం కాదని చెప్పారు. రాజకీయాలను పక్కన పెట్టి బాధ్యత కలిగిన నేతలుగా గంజాయిని అన్ని స్థాయిలలో నిర్ములించడం చేయాలి. అలానే దేశ భవిష్యత్తును కాపాడడం, దేశంలోని యువత నిర్వీర్యం కాకుండా చూడడం కోసం పని చేయాలని ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులను కోరారు.

తాను రాజకీయాలకు అతీతంగా గత నాలుగు సంవత్సరాల కాలం నుండి నల్లగొండ ఎస్పీగా సామాన్య ప్రజలు, సగటు మనిషిని దృష్టిలో పెట్టుకొని నిబద్ధతతో విధి నిర్వహణ చేస్తున్నాను. ఈ విషయాన్ని నల్లగొండ జిల్లాలోని ప్రతి రాజకీయ పార్టీ ప్రతినిధులను, మీడియా, ఈ జిల్లా ప్రజలను అడిగి తెలుసుకోవచ్చని ఆయన చెప్పారు.

రాజకీయాలకు అతీతంగా గంజాయి వ్యాపారంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎవరు ఉన్నా సరే చర్యలు తీసికోవాలని కెసిఆర్ ఆదేశించారు. ఎలాంటి రాజకీయ పార్టీల నాయకులు భాగస్వామ్యం అయినా సరే కఠినంగా, నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించాలని ఆదేశించినట్లు రంగనాథ్ తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తమకు నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా నడుచుకొన్నాను.

తెలంగాణ రాష్ట్రంలో (Telangana State), నల్లగొండ జిల్లాను గంజాయి రహిత ప్రాంతం గా తీర్చిదిద్దడం కోసం తెలంగాణ పోలీసులు పాటుపడుతున్నారు. గంజాయి (Ganja), ఇతర మత్తు పదార్ధాలకు బానిసలుగా మారుతున్న యువతను కాపాడే దిశలో తమ శక్తివంచన లేకుండా మా కృషి చేస్తూనే ఉంటామని రంగనాధ్ అన్నారు. ఈ క్రమంలో గంజాయి స్మగ్లర్లు ఏ.వో.బి. లోనే కాదు కాశ్మీర్ (Kashmir) లో ఉన్నా, దేశంలో ఎక్కడ ఉన్నా వారిని పట్టుకొని తీరుతాం. పట్టుకొని చట్టం ముందు దోషులుగా నిలబెట్టి వారికి శిక్ష పడేలా పని చేస్తామని నల్లగొండ ఎస్పీ ఏ.వి. రంగనాధ్ స్పష్టం చేశారు.

Jana sanani against sale of Visakha Steel Plant