ఫిబ్రవరి 23న మార్చి నెల కోటా విడుదల
తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనానికి (Srivari Darshan) సంబంధించి ఫిబ్రవరి 24 నుండి 28వ తేదీ వరకు అదనంగా రోజుకు 13,000 చొప్పున రూ.300/- ప్రత్యేక ప్రవేశ (Special Entry) దర్శనం టికెట్లను విడుదల చేస్తుంది. ఇవి ఫిబ్రవరి 23వ తేదీ బుధవారం నుండి టిటిడి (TTD) ఆన్లైన్లో అందుబాటులోకి వస్తాయి అని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.
అదేవిధంగా, ఫిబ్రవరి 26 నుండి 28వ తేదీ వరకు అదనంగా రోజుకు 5,000 చొప్పున సర్వదర్శనం టోకెన్లను ఆఫ్లైన్లో తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, శ్రీ గోవిందరాజస్వామి సత్రాల్లో ఏర్పాటుచేసిన కౌంటర్లలో భక్తులకు కేటయించనున్నట్లు టీటీడీపీ వెల్లడించింది.
అలానే, మార్చి నెలకు సంబంధించి రోజుకు 25 వేలు చొప్పున రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఫిబ్రవరి 23న ఆన్లైన్లో విడుదల చేస్తారు.
అదేవిధంగా, మార్చి నెలకు సంబంధించి రోజుకు 20 వేలు చొప్పున సర్వదర్శనం టోకెన్లు కూడా ఆఫ్లైన్లో తిరుపతిలోని (Tirupati) కౌంటర్ల ద్వారా కేటాయిస్తారు అని టీటీడీ ఒక ప్రకటనలో వెల్లడించింది.