Maddi Anjaneya TempleMaddi Anjaneya Temple

వెల్లడించిన దేవస్థాన ఈవో ఆకుల కొండలరావు

శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవాలయానికి (Maddi Anjaneya Swamy Temple) మంగళవారం మద్యాహ్నం గం.02.30 ని.ల.వరకు వివిధ సేవల రూపేణ రూ. 1,72,950/- లు ఆదాయం (Revenue) సమకూరినదని ఆలయ కార్య నిర్వహణ అధికారి ఆకుల కొండలరావు వివరించారు. శ్రీ స్వామి వారి దర్శనమునకు విచ్చేసిన సుమారు 2600 మంది భక్తులకు స్వామి వారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ జరుపబడినదన్నారు. స్వామి వారి దర్శనముంకు విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా ఆలయ పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ ధర్మకర్తల మండలి అద్యక్షురాలు శ్రీమతి సరితా విజయభాస్కర రెడ్డి, మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు.

పశ్చిమగోదావరి నెల్లూరు జిల్లా జంగారెడ్డిగూడెం (Jangareddygudem) మండలం గురవాయిగూడెం గ్రామంలో వెం చేసి ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో మంగళవారం సందర్భముగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. మద్ది ఆంజనేయస్వామి వారి దర్శనార్ధము చుట్టు ప్రక్కల గ్రామముల నుండియే గాక సుదూర ప్రాంతముల నుండి అత్య అధిక సంఖ్యలో విచ్చేసి శ్రీస్వామి వారి ఆలయము చుట్టూ 108 ప్రదక్షణలు చేసి, మొక్కుబడులు తీర్చుకుని, శ్రీ స్వామి వారికి అత్యంత ప్రీతీకరమైన తమలపాకులు (నాగవల్లీ దళములు)తో అష్టోత్తరం పూజలను, అన్నప్రాసనలు, వాహనం పూజలను నిర్వహించుకున్నారు.

— జంగారెడ్డిగూడెం నుండి గరువు బాబురావు

మూడు రాజప్రాసాదాలు కోసమే మూడు రాజధానులు: జనసేన