ChintalapudiChintalapudi

పశ్చిమగోదావరి ఏలూరు జిల్లా చింతలపూడిలో (Chintalapudi) తెలుగుదేశం పార్టీ (Telugu desam) ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు (Potti Sreeramulu) వర్ధంతి కార్యక్రమం గురువారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ అధ్యక్షులు పక్కాల వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బోడా నాగభూషణంలు మాట్లాడుతూ తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఉండాలని అలుపెరుగని పోరాటం చేసి పొట్టి శ్రీరాములు అమరుడయ్యారని తెలిపారు. ఆయన చేసిన సేవలు అజరామరం అని కొనియాడారు.

టీడీపీ చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు బోడ అనీష్ కుమార్ మాట్లాడుతూ ప్రాణ త్యాగం చేసిన మహనీయుడు ఆశయాన్ని జగన్ రెడ్డి నేడు తుంగలో తొక్కుతూ రాష్ట్ర అభివృద్ధిని ప్రశ్నార్థకం చేశాడని ఆంధ్ర రాష్ట్రానికి తీరని ద్రోహం ఈ జగన్ రెడ్డి చేస్తున్నాడని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా రైతుకార్యదర్శి కొత్తపూడి శేషగిరిరావు,నత్తా రవి, నాయకులు గంధం ఏసుపాదం, నియోజకవర్గ నాయకులు మారుమూడి థామస్, మన్యం సత్తిబాబు, మోరం ఈశ్వర్, సుభాని, టోకూరి ఏబు తదితరులు పాల్గొన్నారు.

–జంగారెడ్డిగూడెం నుండి గరువు బాబురావు

హాలిడే ఇవ్వాల్సింది పంటలకు కాదు వైసీపీ పాలనకి: జనసేన