Sri KrishnadevarayaluSri Krishnadevarayalu

మహోన్నతమైన బలిజ రాజుల చరిత్ర నేటి వరకు మరుగున పడిపోయింది. (Balija Rajula Charitra) కాపులు (Kapu) ముందా? బలిజలు (Balija) ముందా ?అనే మీమాంశ అందరిలో ఉంది. బలిజ రాజుల చరిత్ర తెలిసికొంటే ఈ అనుమానాలకు చక్కటి సమాధానాలు దొరుకుతాయి. శెట్టి, గావుండ, రాయ, నాయుడు, రావు, దేశాయి, పెద్ద కాపు గారు మొదలగునవి బలిజ-కాపుల ప్రధాన పట్టపు బిరుధములు.

బలిజ (Balija), తెలగ (Telaga), ఒంటరి (ontari), కాపు (Kapu), మున్నూరు కాపు, తూర్పు కాపు కులాలు బలిజ అనే ఒకే కుదురుకు చెందినవారు.

బలిజలు ఆర్యావర్తనంలోని అహిచ్ఛత్రపురము నుండి దక్షిణాపథమునకు వచ్చినవారము అని తమచే వేసుకోబడిన అనేక శాసనాలలో చెప్పుకుంటూ వచ్చినారు. వీరు నేటి కర్ణాటకలోని ప్రపంచప్రసిద్దిగాంచిన మరియు చాళుక్య వంశీయులకు తొలిరాజధానిగా వర్ధిల్లిన ఐహోలు అనే ఆర్యాపురం ముఖ్యకేంద్రముగా దక్షిణాది అంతా విస్తరించారు.

దీనినే అయ్యావళి అని పిలిచేవారు. వీరు అహిచ్ఛత్ర పురవరాధీశ్వరులు, అయ్యావళి పురవరాధీశ్వరులు అని పేర్కొనబడేవారు.

56 దేశాలవారు అని పిలువబడేవారు. మహాజనులు అని పిలువబడేవారు.

56 దేశాలలోనూ, 9 ఖండాలలోనూ అపారమైన “వ్యాపారాలు” చేసేవారు. గొప్ప గొప్ప నావికాదళాలతో తూర్పుదేశాలలో వలస వ్యాపార స్థావరాలు ఏర్పాటుచేసుకొనెను.

వీర బలిజ సమయ ధర్మ ప్రతిపాలకులు, అన్నికులాలకు కులపెద్దలుగా వ్యవహారాలూ చక్కబెట్టే పెద్దరికం కలిగినవారు.. కులపెద్దలుగా “బలిజ మహానాడు”లు నిర్వహించే వారని శాసనాలలో పేర్కొన్నారు.

వీరినే గౌరీదేవి పేరుమీద గౌరీపుత్రులు అనీ, గవరై, కవరై అని పిలిచేవారు. యజ్ఞ సంభవులవుట వలన “బలిజలు” అని పిలువబడినారు, దైత్య చక్రవర్తి బలి మహారాజు పేరుమీద ఆతని సంతతులు “బలిజలు” అని కూడా పిలువబడినారు, చంద్రవంశ బలి మహారాజు పేరుమీద ఆతని సంతతులు “బలిజలు” అని పిలువబడినారు, యదువంశ బలరాముని పేరుమీద ఆతని సంతతులు “బలిజలు” అని పిలువబడినారు.

సూర్య, చంద్ర, యదు, నాగ వంశాలవారు తరువాత “బలిజవారు”గ పిలువబడినారు. చాళుక్య, చోళ, పల్లవ, హైహయ, హొయసల, కాకతీయ వంటి రాజ వంశ సంతతులు కూడా బలిజవారిలో కలిసి క్షత్రియ బలిజ వారిగా పేర్కొనబడినారు.

ఉత్తరాదిన “బనియా”, “వనియా”

ఈ విధంగా బలిజవారు తరతరాలుగా వేల సంవత్సరాల నుండి వ్యాపార వాణిజ్యాలతో బాటు రాచరిక పరిపాలనలలో నిమగ్నమై ఉన్న వర్గం అని చరిత్ర ఉన్నది. వీరినే తమిళనాడులో “కవరై” అని, కర్ణాటకలో “బనజిగర్” అని కూడా అంటారు…ఉత్తరాదిన “బనియా”, “వనియా” అనీ అంటారు.

ఈ పేర్లన్నీ “వణిజ” అనే మూల సంస్కృత పదమునుండి వచ్చినవి.. వీరు ఋగ్వేదం, రామాయణం, మహాభారతం వంటి పురాణ గ్రంధాలలోను, జైన, బౌద్ధ వాఙ్మయాలలోనూ వర్ణించబడినారు.

వీరు 56 దేశాలలో ఆయా దేశాల పేర్లతో కూడా పిలవబడతారు. కన్నడ ప్రాంతం వారు “కన్నడ బలిజ” అని, తమిళ ప్రాంతం వారు “ఆరవ బలిజ” అని, తెలుగు ప్రాంతం వారు “తెలుగు బలిజ” లేదా “తెలగబలిజ” అని పిలవబడ్డారు.

ఈ బలిజవారిలో అనేక ఉప కులాలు వర్గాలు ఉన్నాయి. వాటిలోకొన్ని ఈ విధంగా ఉన్నాయి.

బలిజల్లో ఉపకులాలు

రాచబలిజ, క్షత్రియబలిజ, తుర్వ బలిజ, తుళువ కవరై, రాహుతబలిజ, ఒప్పనకారబలిజ, ముసుగుబలిజ, రత్నాలబలిజలు, తెలగబలిజ, పట్టణశెట్టి, పట్టణస్వామి, వలయాలసెట్టి, గాజులబలిజ, గంధంబలిజ, పువ్వులబలిజ, బలిజిగ, బందరుకవరై, కవరై వడుగన్, లింగమండికవరై, కవరై చెట్టి, రాయదుర్గంబలిజ, కాంచిపురంబలిజ, వక్కలబలిజ, ఉప్పుకవరై, నాయుడు, అరవబలిజ, ఆకుబలిజ, బలిజశెట్టి, బుట్టిబలిజ, పెరికబలిజ, బలిజనాయుడు, దూదిబలిజ, ఏనూటిబలిజ, గవరబలిజ, గండవరంబలిజ, కుల్లూరుబలిజ, గోపతిబలిజ, గోనుగుంటబలిజ, గుగ్గిళ్ళబలిజ, మిరియాలబలిజ, గురుబలిజ, గోరిబలిజ, గౌరబలిజ, కొండేటిబలిజ, లింగబలిజ, మహతడిబలిజ, నీలిబలిజ, పెదకంటిబలిజ, పాటిబలిజ, పలాసకవరై, పగడాలబలిజ, రాజమహేంద్రవరంబలిజ, శెట్టిబలిజ (కోస్తా జిల్లాలలో ప్రధాన బిసిలు)తోటబలిజ, తొగరుబలిజ, ఆదిబనజిగ, జైనబణజిగ, సజ్జనబలిజ, లింగాయత బలిజ, దాసబలిజ, విజయనగరంబలిజ, పెనుకొండబలిజ, చంద్రగిరిబలిజ, గంజాముబలిజ, ఓరుగంటిబలిజ, దేశాయిశెట్టి, మహానాటిబలిజలు, ముత్యాలబలిజలు, రాళ్ళ బలిజలు, కండీబలిజలు, కొయిలడిబలిజలు, మహాజనబలిజ, చిత్రాలబలిజ, పత్తిబలిజ, జనపబలిజ, ఓడబలిజ, వలసబలిజ, పూందమల్లిబలిజ ఇలా ఎన్నో ఎన్నెన్నో బలిజ ఉప కులాలు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఒడిషా, కేరళ, పాండిచ్చేరి, ఆంద్ర, ఉత్తరభారతం, శ్రీలంక లలో గణనీయంగా ఉన్నాయి.

చాళుక్య, చోళ, పల్లవ, కాకతీయుల కాలాలలోనే వీరిని బలిజలుగా పేర్కొన్నారు. విజయనగర కాలంనాటికి అపారమైన సంపదలతో ఎంతో గొప్ప వైభవ జీవితాలను చవిచూసిన వీరు, విజయనగర పతనం తరువాత జరిగిన అనేక రాజకీయ సామాజిక మార్పులతో అపార సంపదలు హరించుకుపోగా, వీరిలో కొందరు తెలుగు ప్రాంతములో ముఖ్యంగా “గుంటూరు, కృష్ణ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, గంజాం” జిల్లాలలో – తెలగాబలిజలుగా , తెలగాలుగా కూడా పిలుచుకొనుచూ సైనిక, వ్యాపార జీవనం సాగిస్తూ ఉండేవారు.

వ్యవసాయదారులుగా స్థిరపడ్డ బలిజ కాపులు

రానురానూ 1890 నాటికి సైనిక, వ్యాపార అవకాశాలు తగ్గటంతో గ్రామీణ ప్రాంతాలలో భూస్వాములుగా, తరువాత వ్యవసాయదారులుగా స్థిరపడుతున్న క్రమంలో వీరిలో కొందరు గ్రామాలలో పెద్దలుగా ఉంటూ పెద్దకాపు (మునసబు)లుగా పిలువబడుతూ వ్యవసాయం చేస్తూ కాపు అని పేరుతొ కూడా పిలువబడినారు.

గ్రామాలలో రెడ్లను, కాపులను మునసబులు గానూ నియమించిన ఘనత కూర్మా వెంకట రెడ్డి నాయుడు కే దక్కుతుంది. అప్పటి వరకూ గ్రామాలలో విజయనగరం రాజులు, జమిందార్ల పాలనలో బ్రాహ్మణులు ఎక్కువ ఆధిపత్యం చెలాయించే వారు. వీరికి ఆనాడే 15వ శతాబ్దం నుండి గ్రామాలలో పన్నుల వసూలు చేయడం జరిగేది.ఈ విధంగా గ్రామాలలో బ్రాహ్మణాధిపత్యం అనాదిగా ఉండేది.

సర్ కెవి రెడ్డి నాయుడు 1915 నుంచి బ్రిటిష్ ప్రభుత్వంలో మద్రాస్ ప్రెసిడెన్సీ లో హైకోర్టు కు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమితుడయ్యారు. అంతకు ముందు ఆయన ఏలూరు జిల్లా కోర్టు లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పని చేసి 1915లో పదోన్నతి పొంది చెన్నపట్నం వెళ్ళారు.

వీరు తప్ప మిగతా దక్షిణభారతదేశములో అంతటా విస్తరించి ఉన్న వీరి కుల వర్గం వారందరూ బలిజ వారు అని మాత్రమే పిలవబడుచూ చరిత్ర కలిగి ఉన్నారు… కోస్తా జిల్లాలలో వీరిని తెలగ కాపు అని, బలిజ అని, ఒంటరి అని, తూర్పుకాపులు అని, రాయలసీమలో వీరిని బలిజ అని, తెలంగాణలో మున్నూరుకాపులు అని, బలిజ అని వ్యవహరిస్తారు.

మద్రాస్ ప్రెసిడెన్సీ బ్రిటిష్ సెన్సస్ రికార్డ్స్ ప్రకారం

కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ లలో వీరిని లింగ బలిజ కులస్తులు అని కూడా అంటారు.
ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్లో వీరు 1921 నాటి మద్రాస్ ప్రెసిడెన్సీ బ్రిటిష్ సెన్సస్ రికార్డ్స్ ప్రకారం ఈ బలిజ, తెలగ, ఒంటరి, కాపు కులస్తులు 18,38,570 మంది ఉన్నారు. ఈ గణన సర్ కెవి రెడ్డి నాయుడు చేపట్టారు. జస్టిస్ పార్టీ లో చేరిన తర్వాత కమ్యునల్ జి.ఓ.తీసుకొని రావడానికి విశేషంగా కృషి చేశారు.

అనగా అప్పట్లో నే కాపులు, బలిజలు 14 శాతం నుండి 15శాతం వరకు కలరు. బలిజల్ని కాపులనువెనుకబడిన కులాల్లో చేర్చాలని వీరు ఉద్యమాలు చేస్తున్నారు. కానీ మిగతా వెనుకబడిన కులాల వాళ్ళు, మేము మీకంటే వెనుకబడి ఉన్నామని అభ్యంతరం చెబుతున్నారు.

అందువలన రిజర్వేషన్ సమస్యను తాకకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ కులస్తులకు కూడా బీ.సీ. ల లాగానే స్కాలర్షిప్పులు మంజూరు చేసింది. ఇప్పుడిప్పుడు తూర్పుకాపులు మున్నూరు కాపులుతో వియ్యమందుతున్నారు.

తూర్పు కాపులు అనేవారు ఒకప్పుడు గాజుల బలిజ కులస్తులు అని వారి చరిత్ర తెలియ జెబుతుంది. అలానే మున్నూరు కాపులు అనేవారు సీమాంధ్ర నుండి తెలంగాణకు వలస వెళ్లిన 300 బలిజ కుటుంబాల వారి సంతతి అని వారి చరిత్ర తెలియజెబుతుంది.

బ్రిటిష్ సెన్సస్ రికార్డ్స్, డిస్ట్రిక్ట్ మాన్యువల్స్, గాజీటీర్స్ ప్రకారం

నిజానికి కాపులు అనేవారిలో 1871నుండి 1931 వరకూ ఉన్న బ్రిటిష్ సెన్సస్ రికార్డ్స్, డిస్ట్రిక్ట్ మాన్యువల్స్, గాజీటీర్స్ ప్రకారం ప్రస్తుతం రెడ్లు అని పేరు మార్చుకున్నవారు కూడా కలిసే ఉన్నారు. నేటికీ వీరందరిని కాపులు అనే పిలుస్తారు.

అయితే తీరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలోని అత్యధిక కాపులు బలిజ సామాజిక వర్గంనుండి వ్యవసాయదారులుగా మారారు. అలా మారి కాపు అని పిలుచుకుంటున్నట్టు గతంలో 1950 లలో వచ్చిన కంటే నారాయణ దేశాయి గారి బలిజకుల చరిత్ర గ్రంధంలో, 1920 లలో వచ్చిన తెలగ సంఘాభివర్ధిని వంటి గ్రంధాలలో పేర్కొన్నారు.

సేకరణ: టి వి గోవిందరావు, హైకోర్టు అడ్వకేట్, హైద్రాబాద్

వంగవీటి రంగా చుటూ కమ్మ”టి” దొడ్ల రాజకీయాలు!