Srilanka crisisSrilanka crisis

వెనెజులా (Venezuela), శ్రీలంక (Srilanka) సంక్షోభాల నుండి అప్పుల ఊబిలో (Debt Trap) కురుకుపోబోతున్న ఆంధ్ర (Andhra) ఏమైనా గుణపాఠాలు నేర్చుకోవాల్సి ఉందా? ఉంటే ఏమిటది? ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తున్నది. అధికారం పార్టీ ఈ ఆరోపణలను కొట్టిపారేస్తుండగా మెయిన్ మీడియా (Main Media), సోషల్ మీడియాల్లో (Social Media) ఇదే విషయంపై చర్చలు నడుస్తున్నాయి.

మొదటిది వెనెజులా సంక్షోభం

ఆధునిక ప్రపంచం లో మనం చూసిన మొదటిది వెనెజులా సంక్షోభం. ఒకప్పుడు వెనెజులా దేశంలోని రైల్వే స్టేషన్ లేదా విమానాశ్రయం లో వజ్రాలు పెట్టి మర్చిపోయినా అవి అక్కడే ఉండేవి నెల తర్వాత అయినా. వెనెజులాని మించిన అందమైన దేశం కానీ, ప్రజలు కానీ, అంత సంపన్నమైన దేశం కానీ భూ ప్రపంచం లో లేదు.

ఇప్పుడు చినిగిపోయిన కట్ డ్రాయర్ దండం మీద నుంచి బయట పడిపోయినా దానికోసం కొట్టుకు చస్తూ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ క్రైం రేట్ ఉంది. ప్రధాన కారణం ఉచిత పథకాలు (Free beeies). ఎన్నికల్లో గెలవటం కోసం అధ్యక్షుడు అన్నీ ఫ్రీ గా ఇస్తూ పోయాడు. ప్రపంచ ఆయిల్ మార్కెట్ చిన్న కుదుపుకి లోని అయ్యి వెనెజులా ఆదాయం తగ్గింది. అయినప్పటికి ప్రభుత్వ అసమర్ధతతో ఉచిత పథకాలను కొనసాగించడం వలన ఆ వెనెజులా దేశం ఈ రోజు అత్యంత పేద దేశంగా మారింది. ఇదీ అంతా కేవలం 20 సంవత్సరాల కాలంలోనే జరిగిపోయింది.

రెండవది శ్రీలంక సంక్షోభం

ప్రస్తుతం మనం చూస్తున్న రెండవది శ్రీలంక (Srilanka) సంక్షోభం. ప్రస్తుతం కొన్ని రోజులు ఎమర్జన్సీ కూడా విధించారు. దేశం అంతా అల్ల కల్లోలంగా ఉంది. కనీసం సముద్రంలోకి పోయి చేపలు పట్టే బోట్లకి కూడా ఇంధనం లేదు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటాయి. ప్రధాన కారణం “ఆదాయం తక్కువ, అప్పులు ఎక్కువ”.

మనకి నెలకి లక్ష రూపాయల జీతం వస్తుంటే 30 లక్షల లోన్ పెట్టి చిన్న ప్లాట్ తీసుకొని మనకి వచ్చే లక్షలో నెలకి 30 వేలు లోను ఎమౌంట్ కడితే మొగిలిన 70 వేల తో సంతోషంగా బతకొచ్చు. ఇక్కడ లోన్ తీసుకోవటం తప్పు కాదు.

అదే మనకి వచ్చేదే నెలకి 30 వేలు అయి నెలకి లోన్ ఎమౌంట్ 70 వేలు కట్టాల్సి వస్తే ఏమి జరుగుతుంది? ఆత్మహత్య చేసుకోవాలి లేదా అరాచకాలు చేయాలి లేదా మళ్ళీ ఇంకో లోన్ తీసుకోవాలి. శ్రీ లంక అదే చేసింది అప్పు తీర్చటానికి మళ్ళీ అప్పు చేసింది (చేతకాని అసమర్ధ నాయకుల వలన)

సాధారణం గా ప్రపంచ బ్యాంక్ (World Bank), అంతర్జాతీయ ద్రవ్య నిధి (International Monetary fund), జపాన్ బ్యాంక్ (Jagan Bank), సింగపూర్ బ్యాంక్ (Singapore Bank) లాంటివి వివిధ దేశాలకి అప్పు ఇస్తుంటాయి. అవి 1% మాత్రమే వడ్డీ వసూల్ చేస్తాయి మరియూ 30 నుంచి 50 సంవత్సరాల కాలం లో అప్పుని తీర్చవచ్చు. ఇది ఎవరైనా తీసుకోవచ్చు & మంచి రూట్.

శ్రీ లంక నాయకులు (Srilanka Leaders) చేసే దుబారా ఖర్చుకి కమర్షియల్ బ్యాంక్ ల నుంచి, కమర్షియల్ దేశాల నుంచి కూడా అప్పులు తీసుకున్నారు. వీళ్ళ వడ్డీ 6% పైగానే ఉంటుంది మరియూ అతి తక్కువ కాలంలో తీర్చాలి. దీనికి తోడు నెల నెలా వడ్డీ మిస్ కాకుండా కట్టాలి. అప్పులు కట్టటానికి తగిన నిల్వలు లేక రేట్లు విపరీతం గా పెంచాల్సి వచ్చింది. కరోనా వలన వ్యాపారాలు సరిగ్గా నడవక ప్రజలకీ, ప్రభుత్వాలకి ఆదాయం తగ్గింది.

శ్రీలంక ఆదయ మార్గాలు మూసుకుపోయాయి

నిజానికి శ్రీ లంక ప్రధాన ఆదాయ వనరు పర్యాటకం (Tourism), రబ్బరు, తేయాకు మొదలగునవి.

కరోనా వలన టూరిజం తగ్గింది. దీనికి తోడు ప్రపంచంలోనే దేశం అంతా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్న దేశం గా పేరు తెచ్చుకోవాలని ఎచ్చులకి పోయి కెమికల్స్ దిగుమతి ఆపేసి (2019- 20 ప్రాంతం అనుకుంట) అందర్నీ ఆర్గానిక్ వ్యవసాయం చేయమన్నారు. దీనితో ఉత్పత్తి ఆసాంతం తగ్గింది.

వడ్డీలు కట్టటానికి, నిత్యావసర వస్తువుల దిగుమతి కోసం డబ్బులు లేక ధరలు విపరీతంగా పెంచటం వలన దేశం అంతా అశాంతి, అల్లర్లు, హింసతో చెలరేగిపోతున్నారు. కొన్ని చోట్ల కనీసం వంట గ్యాస్, ఇంధనం కూడా దొరకట్లేదు. రోజులో అత్యధిక సమయం 13 గంటలకి పైగా కరెంట్ కోతలు. దీని వలన ఇంకా మరిన్ని సమస్యలు పుట్టుకొస్తున్నాయి.

శ్రీలంక జనాభా నిన్నటికి 2 కోట్ల 15 లక్షలు. జనాభా తక్కువ కాబట్టి భారత్’లో ఉన్న ఏ బడా పారిశ్రామికవేత్త లాంటోడు అయినా సరే పల్లీలు తినటం ఆపి ఆ డబ్బు సాయం చేసినా శ్రీ లంక గట్టెక్కుతుంది. కొంచెం పెద్ద దేశాలు పేద దేశంగా మారడానికి మాత్రం, ఇలాంటి పరిస్థితి వస్తే, కనీసం 100 సంవత్సరాలకి పైగా పడుతుంది.

వెనెజులా నుంచి ప్రపంచం ఏ పాఠం నేర్చుకుందో తెలియదు కానీ శ్రీ లంక నుంచి మాత్రం ప్రతి దేశం, మన దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం గుణపాఠం నేర్చుకోవాలి. ఖర్చులు తగ్గించుకోవాలి. సంక్షేమ పధకాలను పునః సమీక్ష చేసికోవాలి. అప్పులు తేవడం తగ్గించుకోవాలి. ఆదాయవనరులను పెంచుకోవాలి.

లేకపోతే వెనిజులా లేక శ్రీలంకలో వచ్చిన పరిస్థితులే మన రాష్ట్రాల్లోనూ, దేశంలోనూ కూడా రావచ్చు. ఆలోచించండి

Source: అంతర్జాలం నుండి సేకరణ

జనసేనాని పవన్ కళ్యాణ్’కి రాజకీయాలు చేత కాదా?