Shrikanth reddyShrikanth reddy

ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (Telugudesam) రాజకీయ ఆపి అసెంబ్లీ సమావేశాలకు (Assembly Sessions) రావడం గురించి ఆలోచించాలి. ప్రతిపక్ష సభ్యులు (Opposition members) వేసే ప్రతి ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంది అని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో శాసనసభ స్పీకర్‌ (Assembly Speaker) తమ్మినేని సీతారాం, శాసనమండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు అధ్య‌క్ష‌త‌న‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలపై (Budget sessions) సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశం అనంతరం చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి సమావేశ వివరాలను విలేకరులకు వివరించారు.

అసెంబ్లీ సమావేశాలకు ఉన్న ప్రాధాన్యత, అసెంబ్లీకి ఉన్న గౌరవం గురించి శాసనసభ స్పీకర్, కౌన్సిల్‌ చైర్మన్‌ సమక్షంలో సుదీర్ఘంగా చర్చించాం. అసెంబ్లీ జరిగే రోజుల్లో సభ్యులు అడిగే ప్రతీ ప్రశ్నలకు సమాధానం రావాలని స్పీకర్‌ ఆదేశాలిచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో జీరో అవర్‌కు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని స్పీకర్ (Speaker) చెప్పారు. ప్రజాస్వామ్యంలో అసెంబ్లీకి ఉన్న విలువల గురించి కూడా అధికారులకు తెలియజేశారు. పెండింగ్‌లో ఉన్న 418 ప్రశ్నలకు త్వరగా సమాధానం పంపించాలని స్పీకర్ చెప్పారు. భద్రత ఏర్పాట్లపై కూడా పోలీస్‌ అధికారులకు స్పీకర్‌ ఆదేశాలు ఇచ్చారు అని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

ప్రజాస్వామ్యంలో (Democracy) అసెంబ్లీకి ఇంత ప్రాధాన్యత ఉంది. ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో ఉంది. ప్రతిపక్షానికి మైక్‌ ఇవ్వడానికి ప్రయత్నిస్తే ప్రతీసారి సబ్జెక్ట్‌ మాట్లాడకుండా వ్యక్తిగత ఆరోపణలతో, వైయస్‌ఆర్‌ సీపీని (YSRCP), ప్రభుత్వాన్ని అస్థిరపర్చాలనే ప్రతిపక్షాలు చూశాయి. సబ్జెక్ట్‌లోకి రండి అని చెప్పినా.. ఎవరూ మాట్లాడని అంశాన్ని తీసుకొని కుటుంబ సభ్యులను కూడా అంశంలోకి తీసుకువచ్చి రాజకీయం చేసి సమావేశాలను చంద్రబాబు బహిష్కరించాడు అని శ్రీకాంత్ రెడ్డి వివరించారు.

చంద్రబాబు (Chandra Babu), టీడీపీ (TDP) ఎమ్మెల్యేలు ప్రభుత్వం ఏం చేయలేదని బయట మాట్లాడుతున్నారు. అదే సభలో మాట్లాడేందుకు కావాల్సిన సమయాన్ని కేటాయించడానికి స్పీకర్‌ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎలాంటి ప్రశ్నలు వేసినా సమాధానం చెప్పడానికి, చర్చించడానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. పార్టీల మధ్య ఎన్ని విభేదాలు అయినా ఉండొచ్చు,. కానీ అసెంబ్లీని గౌరవించాలి. పార్టీకి మైలేజ్‌ తెచ్చుకోవాలనే ప్రయత్నాలు మాని ప్రతిపక్షం అసెంబ్లీ సమావేశాలకు రావాలి. అలా వస్తే ప్రతీ మాటకు సమాధానం చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

జనసేన ఆవిర్భావ సభకు పగడ్భంధీగా సన్నాహాలు