ఆర్మీ హెలికాప్టర్ (Army Helicopter) ప్రమాదంలో సీడీఎస్ (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) జనరల్ బిపిన్ రావత్ (Bipin Rawat) కన్నుమూశారు. ఆయన ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదవశాత్తూ తమిళనాడులో (Tamilnadu) కుప్పకూలిన విషయం తెలిసిందే. కోయంబత్తూర్ (Coimbatore), కూనూరు మధ్యలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తున్నది. హెలికాప్టర్లో బిపిన్ రావత్తో పాటు, ఆయన సతీమణి మధులిక రావత్ మరియు ఆర్మీ ఉన్నతాధికారులు (Army Officers) కూడా ఉన్నారు.
వెల్లింగ్టన్లోని డిఫెన్స్ కాలేజీలో (Defence college) లెక్చర్ ఇచ్చేందుకు ఈ ఉదయం రావత్ దంపతులు, ఆర్మీ అధికారులతో కలిసి ప్రత్యేక విమానంలో ఈ ఉదయం దిల్లీ నుంచి తమిళనాడు (Tamilnadu) వెళ్లారు. సూలూరు ఎయిర్బేస్ (Airbase) నుంచి మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆర్మీ హెలికాప్టర్లో వెల్లింగ్టన్ వెళ్తుండగా ప్రమాదవశాత్తూ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో రావత్ సహా హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న 13 మంది మృతిచెందినట్లు వాయుసేన అధికారికంగా ధ్రువీకరించినట్లు తెలుస్తున్నది. హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.