Nagababu KonidalaNagababu Konidala

జనసైనికులు, వీర మహిళలకు అందుబాటులో ఉంటా
పార్టీ కోసం నిజాయితీగా పనిచేసే వారికి ప్రోత్సాహం
పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో ముందుకు వెళ్తాం
జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన నాగబాబు

రాజకీయ వ్యవస్థల్లో మార్పుకోసం నిత్యం తపిస్తున్న జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్’ని (Pawan Kalyan) సీఎం (AP CM) చేయాలి అనే లక్ష్యం కోసం నిత్యం శ్రమిస్తా అని కొణెదల నాగబాబు (Konidala Nagababu) అన్నారు.  మహోన్నత ఆశయంతో పనిచేసే నాయకుడికి క్రమశిక్షణ గల కార్యకర్తగా,జనసైనికుడిగా జనసేన పార్టీలో (Janasena Party) నా ప్రస్థానం మొదలైంది. 2019 నుంచి పార్టీ కోసం క్రియాశీలకంగా పనిచేస్తూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు చేశాను. జనసైనికులు, వీర మహిళలలను తరుచూ కలిసే అదృష్టం దక్కింది. పార్టీ అభ్యున్నతి కోసం వారి సలహాలు, సూచనలు తీసుకుంటూ ముందుకు సాగాను. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న జనసైనికులు, వీర మహిళలను సమన్వయ పరుస్తూ వచ్చాను.

వారి వెన్నంటే నడిచేలా నా ప్రయాణం సాగింది. ఇప్పుడు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నా మీద ఉన్న నమ్మకంతో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాధ్యతను అప్పగించారు. ఇదో బృహత్తరమైన బాధ్యతగా భావిస్తాను. దానిని పార్టీ ఉన్నతి కోసం ఉపయోగించి, పూర్తి శాయశక్తులతో పని చేస్తానని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కొణిదెల నాగబాబు అన్నారు.

ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన తొలిసారి హైదరాబాద్ లో వీడియో సందేశం ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ ” జనసేన పార్టీ శ్రేయస్సు కోసం పవన్ కళ్యాణ్ నాకు అప్పగించిన బాధ్యతలను అంతే శ్రద్ధాశక్తులతో పూర్తి చేస్తాను. ప్రతి అడుగు జనసైనికులు, వీర మహిళలను ముందుకు నడిపే విధంగా ఉంటుందని అన్నారు.

తప్పును నిలదీసే వ్యక్తుల సమూహం జనసేన

పాలకుల తప్పిదాలను బలంగా ప్రశ్నించగల సత్తా జనసేన పార్టీకి ఉంది. క్షేత్రస్థాయిలో జనసైనికులు, వీర మహిళలు నిత్య జాగురతతో ఉంటూ, పాలకుల తప్పుఒప్పులను తెలియ జేస్తూనే ఉంటారు. వారిలో పోరాట స్ఫూర్తిని నింపిన పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న కార్యకర్తలందరికీ అండగా నిలుస్తాం. వీలైనంత వరకు ఎక్కువమందిని ప్రత్యక్షంగా కలుస్తాను. వారి రాజకీయ ఆలోచనలకు, పోరాటానికి వెన్నుదన్నుగా నిలిచేలా ప్రోత్సహిస్తాను. నిత్యం కార్యకర్తలతో కలిసి పనిచేసేందుకు ప్రాధాన్యం ఇస్తాను అని కొణిదల నాగబాబు అన్నారు.

సద్విమర్శలతో ముందుకు వెళ్తాం

ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నకునే ప్రభుత్వం వారికి సుపరిపాలన అందించాలనేదే మా విధానం. ప్రభుత్వంపై ఏదోకటి విమర్శ చేయాలి అనేలా కాకుండా, పాలనలో జరుగుతున్న తప్పిదాలను ప్రజలకు తెలియజెప్పేలా పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రయత్నం మాకందరికీ స్ఫూర్తిదాయకం. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నేను క్షేత్రస్థాయి పర్యటనలు చేశాను. అక్కడి పరిస్థితులు, పాలనలో జరుగుతున్న అన్యాయం, అవినీతి, ఇతర పాలనపరమైన అంశాల మీద జనసైనికులు, వీర మహిళలు చేస్తున్న పోరాటాన్ని గుర్తించాను. అన్ని అంశాలను నిత్యం అవగతం చేసుకుంటూ వారు ముందుకు వెళ్తున్న తీరు అభినందనీయం.

గుడ్ గవర్నెన్స అనేది ప్రజలకు అందాలి. దానికోసం ఇష్టానుసారం ప్రభుత్వంపై బుదర జల్లకుండా సద్విమర్శలతో పాలకుల తప్పులను తెలియజేస్తాం అని నాగబాబు అన్నారు.

నిత్యం సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతాం

ఓ గొప్ప లక్ష్యం కోసం ప్రయాణించే దారిలో భిన్నమైన ఆలోచనలు ఉండటం సహజం. ఆశయం కోసం పనిచేసే జనసేన పార్టీ కార్యకర్తల్లో ఏవైనా భిన్న భిప్రాయాలు ఉంటే వాటిని సరిచేస్తాం. వారికి అర్ధం అయ్యే రీతిలో పార్టీ స్టాండ్ ప్రకారం సర్దిచెబుతాం. పార్టీ కోసం మాత్రమే ప్రతి కార్యకర్త పనిచేయాలి. చిన్న చిన్న అంశాలు ప్రతి పార్టీలో ఉంటాయి. జనసేన పార్టీలోని ఉండే ఎలాంటి చిన్న సమస్య అయినా వెంటనే పరిష్కరించేలా చూస్తాం. సృహద్భావ వాతావరణంలో కూర్చొని మాట్లాడితే పరిష్కారం కాని సమస్యలు ఉండవు. జనసైనికులు, వీర మహిళలను సమన్వయం చేసుకుంటూ నా ప్రయాణం ముందుకు సాగుతుందని నాగబాబు అన్నారు.

మన నాయకుడి గొప్ప వ్యక్తిత్వాన్ని ప్రజలకు తెలియచెబుదాం. పవన్ కళ్యాణ్ నిజాయతీ, శ్రమ, చిత్తశుద్ధి అనేవి రాష్ట్ర ప్రజలకు పాలనాపరంగా ఎంతమేర ఉపయోగపడతాయి అనేది ప్రతి జనసైనికుడు, వీర మహిళా ప్రజలకు తెలియజెప్పాలి. నిస్వార్థంగా రాజకీయాల్లోకి వచ్చిన జనసేనాని రాష్ట్రానికి ఎంత మేర ఉపయోగపడతారు అనేది అర్ధం అయ్యేలా చెప్పాలి. కల్మషం లేకుండా పార్టీ కోసం పనిచేస్తూ, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని స్ఫూర్తిగా తీసుకున్న జనసైనికులంతా బలంగా పనిచేయాలని కోరుకుంటున్నాను. నాకు ఈ గురుతర బాధ్యతలను అప్పగించిన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అని కొణిదల నాగబాబు అన్నారు.

జనసేనాని పవన్ కళ్యాణ్’ని సీఎం చేయడమే మా ధ్యేయం

పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడమే ప్రధాన ధ్యేయంగా క్షేత్రస్థాయిలో కార్యకర్తల నుండి రాష్ట్రస్థాయి నాయకుల వరకూ అందరితో మమేకమై సమిష్టిగా పని చేస్తాం. ప్రజా ప్రయోజనాల పట్ల నిబద్ధత, నిజాయితీ, ప్రజాస్వామ్యంపై గౌరవం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో చాలా అరుదు. నా అనుభవంలో ఎందరో మంత్రులను, ముఖ్యమంత్రులను, వ్యక్తిగత ప్రయోజనాలు, స్వార్థం, అవినీతి, ఆధిపత్యం ప్రదర్శించే నాయకులను ఎంతో మందిని చూసాను. నేను అత్యంత దగ్గరగా చూసిన వాడిగా చెప్తున్నాను పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఎవరూ ఊహించలేని స్థాయిలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే సత్తా, ప్రణాళిక పవన్ కళ్యాణ్ దగ్గర ఉంది.

ప్రజలిచ్చిన అధికారాన్ని ఉపయోగించి ప్రజలపైనే పెత్తనం చేస్తున్న వైసీపీ నాయకులకు భయపడాల్సిన అవసరం జన సైనికులకు, వీర మహిళలకు లేదు. అధికార దర్పం తప్ప వైసీపీ నాయకుల కోసం ప్రత్యేక చట్టాలు ఏమీ లేవు. వారు కూడా అందరి లాంటి మనుషులే. పార్టీకి, ప్రజా ప్రయోజనాలకు సంభందించిన ఏ అంశాలైనా చర్చించడానికి జన సైనికులకు, వీర మహిళలకు, జనసేన నాయకులకు నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను. గతంలో పీఏసీ సభ్యుడిగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు చాలా విషయాలు నా అనుభవంలోకి వచ్చాయి. భవిష్యత్తులో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు పర్యటించి జన సైనికులు, వీర మహిళలు, నాయకులతో మమేకమై జనసేన సిద్ధాంతాలు, అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి భావజాలం, వ్యక్తిత్వానికి అనుగుణంగా పార్టీ బలోపేతం కోసం పని చేస్తా అని కొణెదల నాగబాబు అన్నారు.

జనసేన ప్రధాన కార్యదర్శిగా కొణెదల నాగబాబు